డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ఇప్పటి వరకు రెండు సినిమాలు వచ్చాయి. పోకిరి మరియు బిజినెస్మెన్ రెండు సినిమాలు కూడా వీరికి మంచి విజయాలను దక్కించాయి. ముఖ్యంగా పోకిరి సినిమా ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. వీరి కాంబో మూవీ కోసం అభిమానులు గత అయిదు ఆరు సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నారు. ఎట్టకేలకు వచ్చే ఏడాది వీరి కాంబో మూవీ పట్టాలు ఎక్కే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈ కాంబోను పట్టాలెక్కించేందుకు నిర్మాత అనీల్ సుంకర ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఈమద్య కాలంలో అనీల్ సుంకర చేపట్టిన ప్రాజెక్ట్ లు అన్ని ఇన్నీ కావు. చిరంజీవి నుండి మొదలుకుని చిన్న హీరోల వరకు ఈయన వరుసగా సినిమాలు చేస్తున్నాడు. వచ్చే రెండేళ్లలో ఈయన పది నుండి పన్నెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడు మహేష్ బాబుకు పూరి జగన్నాధ్ తో కథ వినిపించాడట. కొన్ని రోజుల క్రితం అనిల్ సుంకర విన్న కథ నచ్చడంతో మహేష్బాబుకు బాగా సూట్ అవుతుందని భావించి మహేష్ ను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాడు.
మహేష్ బాబు మరియు అనీల్ సుంకరల మద్య మంచి సంబంధం ఉంది. అనీల్ చెప్తే తప్పకుండా మహేష్ చేస్తాడు అంటారు. అందుకే వీరిద్దరి కాంబో మూవీ పట్టాలెక్కడం ఖాయం అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పోకిరి రేంజ్ లో మరో మాస్ మసాలా మూవీని పట్టాలు ఎక్కించేందుకు పూరి కథ రెడీ చేయబోతున్నాడు. పూరి జగన్నాద్ ప్రస్తుతం విజయ్ దేవరకొండో ఫైటర్ మూవీ చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత మహేష్బాబుతో వచ్చే ఏడాదిలో సినిమా చేసే అవకాశం ఉంది. రాజమౌళితో మహేష్ మూవీ ఉండనుంది. అంతకు ముందే పూరితో ఒక సినిమాను స్పీడ్గా పూర్తి చేసే అవకాశం ఉందని అంటున్నారు. అసలు విషయంపై అతి త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
117864 937504The website loading pace is amazing. 289211
960890 19517Im glad to become a visitor in this pure internet site, regards for this rare information! 47228