YS Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. జగన్ దాదాపు రూ.1 లక్ష రూపాయల విలువైన మాంట్ బ్లాంక్ కంపెనీ పెన్ను ఉపయోగిస్తాడని అన్నారు. అలాగే ఆయన రూ.5,499 విలువైన బాటిళ్లలో నీటిని నింపి తాగుతాడని ఆయన పేర్కొన్నాడు.
చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో లీటరుకు రూ.50 ల విలువ చేసే నీటిని తాగుతున్నారు అంటూ సాక్షి దిన పత్రిక పెద్ద పెద్ద కథనాలు రాసింది. ఇప్పుడు జగన్ తాగే నీరు ఖరీదు.. చెప్పుల ఖరీదు.. పెన్ను ఖరీదు గురించి ఎందుకు సాక్షి లో కథనాలు రావడం లేదు అంటూ ఆయన ప్రశ్నించాడు.
జగన్ ఒప్పుడు రబ్బరు చెప్పులు వేసుకుని తిరిగేవాడు. కానీ ఇప్పుడు ఆయన చెప్పుల ధర రూ.1,34,800 లుగా రమణారెడ్డి ఆరోపించారు. ఇంత సంపాదన ఎవరిది అంటూ ఆయన ప్రశ్నించాడు. దేశంలో 9 చోట్ల జగన్ కి ప్యాలెస్ లు ఉన్నాయి. వాటి ఫోటోలు చూస్తేనే ఆశ్చర్యంగా ఉంటుందని ఆనం పేర్కొన్నారు. అవన్నీ కూడా ప్రజల సొమ్ముతోనే సంపాదించారని ఆయన ఆరోపించాడు.