మజ్లిస్ పార్టీ నేత ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ 2012 సంవత్సరంలో ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాల్లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని విద్వేష పూరిత ప్రసంగాలు చేసిన కేసుని ఎదుర్కొంటున్నారు. గత పది సంవత్సరాలుగా ఈ కేసుకు సంబంధించి విచారణ జరుగుతోంది. ఎట్టకేలకు విచారణ పూర్తయిందని ఈ నెల 12 వ తారీఖున కేసుకు సంబంధించిన తుది తీర్పును వెలువరించడం జరుగుతుందని కోర్టు వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
రెండు మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలు ఉన్నాయని.. ఆ సమయంలో ఒక కమ్యూనిటీని అత్యంత దారుణంగా ఆయన అవమానపరిచే విధంగా మాట్లాడాడు అని.. మరో కమ్యూనిటీ రెచ్చగొట్టే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని కొందరు ఆరోపించడంతో కేసు నమోదు అయింది. ఇప్పుడు ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి ప్రస్తుతం ఎమ్మెల్యే గా కొనసాగుతున్న ఆయన ఈ విషయం లో ఎలాంటి తీర్పు వస్తుంది అనేది రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన తప్పు చేసినట్లుగా కోర్టు లో నిరూపితమైతే ఎంత శిక్ష పడుతుంది అనే విషయంపై కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
792100 734921I quite happy to discover this web site on bing, just what I was looking for : D too bookmarked . 188520
484304 173770But wanna remark which you have a very decent internet website , I adore the style it truly stands out. 307360
805859 922084Which is some inspirational stuff. Never knew that opinions may possibly be this varied. Thank you for all of the enthusiasm to give such beneficial information here. 701969