మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ వర్షాలే ఓ భారీ ప్రమాదానికి కారణమయ్యాయి. రాయఘడ్ జిల్లాలోని మహడ్ పట్టణంలో ఈ ప్రమాదం జరిగింది. పట్టణంలోని ఓ అయిదు అంతస్థుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ భవనంలో 45 కుటుంబాలకు చెందిన దాదాపు 150 మందికి పైగా నివసిస్తున్నట్టు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రమాదంలో ఇప్పటికి 15 మంది గాయపడ్డారు. మరో 150 మంది శిథిలాల కింద చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది.
ప్రమాద విషయం తెలుసుకున్న నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ హుటాహుటిన మూడు బృందాలుగా అక్కడికి చేరుకున్నాయి. ముంబైకు దాదాపు 170 కిమీ దూరంలో ఉన్న ఈ పట్టణంలో వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయి. దీంతో ఈ భవనం కూలిపోయి ఉంటుందని అంటున్నారు. ఈ బహుళ అంతస్థుల భవనం కట్టి కేవలం ఆరేళ్లు మాత్రమే అయిందని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
#BreakingNews: #Maharashtra #raigad జిల్లాలో కూలిన మల్టీస్టోర్ బిల్డింగ్
👉శిథిలాల కింద దాదాపు 150 మంది పైగా ఉన్నట్లు భావిస్తున్నారు.. ఇప్పటివరకు ఈ ఘటనలో 15మంది గాయపడ్డారు
👉#NDRF బృందాలు ప్రస్తుతం శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు pic.twitter.com/SFhQpxHGPB
— TeluguBulletin.com (@TeluguBulletin) August 24, 2020
825090 424623I like this website quite much, Its a genuinely nice situation to read and get info . 488797