ప్రజలకు కష్టాలు వస్తే మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ ముందుంటారు. కరోనా సమయంలో పేద కార్మికుల ఆకలి కష్టాలు తీర్చడానికి కరోనా క్రైసిస్ చారిటీను మొదలుపెట్టిన విషయం తెల్సిందే. కొన్ని వేల మంది సినీ కార్మికులు దీని వలన లాభపడ్డారు.
అలాగే ఇటీవలే ప్రజలు ఆక్సిజన్ దొరక్క ఇబ్బంది పడుతుంటే రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రతీ జిల్లాలో ఒక ఆక్సిజన్ ప్లాంట్ నెలకొల్పాలని నిశ్చయించుకున్నాడు. ప్రస్తుతం చిరంజీవి ఆక్సిజన్ ప్లాంట్స్ దాదాపు ప్రతీ జిల్లాలో సేవలు అందిస్తున్నాయి.
చిరంజీవి తన సేవలను మరింత విస్తృతం చేయాలని నిర్ణయించుకున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం అంబులెన్స్ ల కొరత ఉందని తెలుసుకున్న చిరంజీవి, ఉచిత అంబులెన్స్ వాహనాలను నడిపించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. దీనికి సంబంధించిన మరింత సమాచారం త్వరలోనే బయటకు రానుంది. చిరంజీవి రెండు రాష్ట్రాల ప్రజల కోసం అందిస్తోన్న సేవలకు అందరూ సలాం అంటున్నారు.
569689 729980Thanks for the excellent post against your blog, it genuinely provides me with a look about this subject.??;~.?? 375005
878269 565357Following examine a couple of of the weblog posts within your website now, and I truly like your manner of blogging. I bookmarked it to my bookmark site list and may be checking back soon. Pls take a look at my site as effectively and let me know what you believe. 447205