Switch to English

అమరావతిలో సీఎం జగన్‌ వాస్తు ‘పోటు’!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

అరెరే.! అంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారిందా.? లేదా.? చంద్రబాబు స్థానంలో జగన్‌ ముఖ్యమంత్రి అయ్యింది నిజమా.? కాదా.? ఇలాంటి డౌట్లు వస్తున్నాయేంటీ.! డౌట్లు వస్తాయి మరి. ఎందుకంటే, వైఎస్‌ జగన్‌ కూడా చంద్రబాబు అడుగు జాడల్లోనే నడుస్తున్నారు కదా. చంద్రబాబు చేస్తే తప్పు. వైఎస్‌ జగన్‌ చేస్తే రైటు.. అన్నట్లుగా వైసీపీ నేతలు తమ అధినేత చర్యల్ని సమర్ధిస్తున్నారు. అచ్చం టీడీపీ నేతలు నిన్న మొన్నటి దాకా చంద్రబాబును సమర్ధించినట్లే. అమరావతిలో తాత్కాలిక సచివాలయం కొన్ని మార్పులకు గురవుతోంది. మార్పు చిన్నదే అని తీసి పారేయడానికి వీల్లేదు. ఎందుకంటే బోలెడంత ఖర్చుతో వాస్తుకు అనుగుణంగా మార్పులు చేస్తున్నారక్కడ. జనం సొమ్ము కదా.. అందరికీ చులకనే. జవాబుదారీతనం లేకపోతే, వాస్తు దోషాలు ఎక్కడ చూసినా కనిపిస్తాయి.

వాస్తు, జాతకాలు వంటివి ఏ రాజకీయ నాయకుడైనా తన ఇంట్లోనే చూసుకోవాలి. కానీ, జనం సొమ్ముని విచ్చల విడిగా ఖర్చు చేయడానికి అలవాటు పడ్డ రాజకీయ నాయకులు అధికార పీటమెక్కగానే వాస్తు పేరుతో అడ్డగోలుగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తారు. అన్ని రకాలుగా చర్చించి వాస్తు నిపుణుల్ని రప్పించి, గొప్ప గొప్ప ఇంజనీర్లతో సచివాలయాన్ని నిర్మించిన చంద్రబాబు, ఆ తర్వాత దానికి చేసిన రిపేర్లు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యమంత్రికి వాస్తు పిచ్చి ఉండకూడదు. చంద్రబాబు ఏమైనా సొంత డబ్బు ఖర్చు పెడుతున్నారా.? అది జనాలికి చెందాల్సిన డబ్బు.. అని అప్పటి ప్రతిపక్ష నేత వాస్తు ఖర్చులపై మండి పడ్డారు. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ చేస్తున్నదేంటీ..

సచివాలయంలో వాస్తు పేరుతో రిపేర్లు జరుగుతున్నాయి. ఇంకా జరుగుతాయి కూడా. ఎందుకంటే జగన్‌ మంత్రివర్గం ఇంకా ఖరారవ్వలేదు. ఒక్కో మంత్రీ తన ఛాంబర్‌ని వాస్తుకనుగుణంగా మార్చితే, ఖర్చు తడిసి మోపెడయిపోతుంది. అప్పుడు చంద్రబాబు చేసిందీ పిచ్చిపనే. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ చేయిస్తున్నదీ పిచ్చి పనే. వాస్తు, జ్యోతిష్యం, జాతకం నమ్మకాలకు సంబంధించింది. ముఖ్యమంత్రి గదికి వాస్తు సరిగా లేకపోతే, రాష్ట్రానికే అరిష్టం అంటూ కొందరు పండితులు ప్రదర్శించిన అత్యుత్సాహం, పాలకులకు లైసెన్స్‌ ఇచ్చినట్లవుతోంది.

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ వాస్తు నమ్మకాలతోనే సెక్రటేరియట్‌ మొహం చూడలేదు ఇన్నేళ్లలో ఎప్పుడూ. ఏదో మార్పులు చేయించుకుని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులు సెక్రటేరియట్‌కి వెళ్తున్నందుకు సంతోషించాలా.? వాస్తు పేరుతో ప్రజా ధనం దుర్వినియోగం చేస్తున్నందుకు బాధపడాలా.? ప్రశ్నించేందుకు పుట్టిన జనసేన పార్టీ, తన తొలి ప్రశ్నని ఈ కోణంలో అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీపై సంధించాల్సి వుంది. ఎందుకంటే, తెలుగుదేశం పార్టీ ఎలాగూ ప్రశ్నించదు. వాస్తు పిచ్చిని పరిచయం చేసిందే ఆ పార్టీ కదా!

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా వైరల్ అయింది. ప్రభాస్ పెళ్లి గురించే...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...