ఐపీఎల్ ఈ సీజన్ ను అర్థాంతరంగా నిలిపి వేశారు. కరోనా బయో బబుల్ ను ఏర్పాటు చేసి అత్యంత జాగ్రత్తల మద్య నిర్వహించినా కూడా కరోనా వైరస్ బారిన ఆటగాళ్లు పడ్డారు. బయో బబుల్ లో ఎక్కడ లోపం జరిగింది అనే విషయాన్ని ప్రస్తుతం బీసీసీఐ వర్గాల వారు ఎంక్వౌరీ చేశారు. తాజాగా ఐపీఎల్ వాయిదా కు క్లారిటీ వచ్చేసింది. మే 1 వ తారీకున అహ్మదాబాద్ లో కోల్కత్తా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కడుపు నొప్పితో స్కానింగ్ కోసం బయటకు వెళ్లాడు. బయో బబుల్ ను వరుణ్ ఛేదించిన విషయాన్ని నిర్వాకులకు తెలియజేయాల్సి ఉంటుంది.
బయటకు వెళ్లి వచ్చిన వరుణ్ చక్రవర్తి జట్టు తో వెంటనే కలిసి పోయాడు. ఆ తర్వాత జట్టు సభ్యులతో భోజనం చేయడంతో పాటు ప్రాక్టీస్ కూడా చేశాడు. బయటకు వెళ్లిన వరుణ్ చక్రవర్తికి కరోనా సోకింది. అక్కడి నుండి బయో బబుల్ లోకి కరోనా ఎంటర్ అయ్యింది. బయో బబుల్ లో చాలా మంది కరోనా పాజిటివ్ అంటూ నిర్ధారణ అవ్వడంతో ఐపీఎల్ ను నిరవదికంగా వాయిదా వేయడం జరిగింది. ఐపీఎల్ ను గత సీజన్ లో దుబాయిలో అత్యంత జాగ్రత్తగా నిర్వహించారు. కాని ఇప్పుడు మాత్రం ఐపీఎల్ ను బీసీసీఐ వారు నిర్వహించలేక పోయారు. ఒక్క వరుణ్ చక్రవర్తి వల్ల మొత్తం ఐపీఎల్ ఆగిపోయింది.
17820 958171I real glad to locate this internet web site on bing, just what I was searching for : D likewise saved to bookmarks . 514207
459976 198145Thank you for your style connected with motive though this info is certain spot a new damper within the sale with tinfoil hats. 543114
517916 899517Some truly good stuff on this internet web site , I enjoy it. 207954