Switch to English

టిబి స్పెషల్: లాల్ కృష్ణుడి నుంచి నరేంద్రుడి వరకు..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

అసలు బాబ్రీ మసీదు-రామజన్మభూమి వివాదం ఏమిటి? ఇది ఎప్పుడు ప్రారంభమైంది? అందుకు దారితీసిన పరిస్థితులేమిటి? చివరకు ఎలా కొలిక్కి వచ్చింది? ఓసారి చూద్దాం..

త్రేతాయుగంలో అంటే దాదాపు 9 లక్షల సంవత్సరాల క్రితం శ్రీరాముడు అయోధ్యలో జన్మించాడన్నది హిందువుల విశ్వాసం. అనంతరం కాలంలో 1528లో బాబర్ చక్రవర్తి అక్కడ బాబ్రీ మసీదు నిర్మించారు. అయితే, మసీదు ప్రధాన డోమ్ ఉన్న కింద భాగంలో ఉండే గదే రాముడి జన్మస్థలమని పలువురి నమ్మకం ఈ నేపథ్యంలో 1885లో మహంత్ రఘుబీర్ దాస్ అనే వ్యక్తి ఫైజాబాద్ కోర్టుకెళ్లారు. బాబ్రీ మసీదు బయట ఆలయ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కోరారు. కానీ కోర్టు దానిని తోసిపుచ్చింది.

1949 డిసెంబర్ 23వ తేదీ ఉదయం బాబ్రీ మసీదులో రాముడి విగ్రహాలు కనిపించడంతో కలకలం రేగింది. అనంతరం ఆ విగ్రహాలను పూజించుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ గోపాల్ విశారద్, రామచంద్ర దాస్ ఫైజాబాద్ కోర్టును ఆశ్రయించారు. వివాదాస్పద ప్రాంతాన్ని అప్పగించాలంటూ 1959లో నిర్మోహి అఖారా పిటిషన్ దాఖలు చేసింది. మసీదులో ఉన్న విగ్రహాలను తొలగించడానికి ఆదేశాలివ్వాలంటూ 1961లో యూపీ సెంట్రల్ సున్నీ వక్ఫ్ బోర్డు పిటిషన్ వేసింది. 1986 ఫిబ్రవరిలో ఆ విగ్రహాలకు పూజలు చేసుకునేందుకు హిందువులకు ఫైజాబాద్ కోర్టు అనుమతి ఇచ్చింది.

1989 ఆగస్టులో ఈ వివాదం అలహాబాద్ హైకోర్టుకు చేరడంతో యథాతథ స్థితికి ఆదేశించింది. 1989 నవంబర్ లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం విశ్వహిందూ పరిషత్ కు వివాదాస్పద ప్రాంతంలో పూజ చేయడానికి అనుమతిచ్చింది. 1990 సెప్టెంబర్ లో బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ రథయాత్ర ప్రారంభించారు. 1992 డిసెంబర్ 6న కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చివేశారు. ఘటనపై విచారణ జరపడానికి ప్రభుత్వం జస్టిస్ లిబర్హన్ కమిషన్ ఏర్పాటు చేసింది. 1993లో పీవీ నరసింహారావు ప్రభుత్వం వివాదాస్ప ప్రాంతానికి సమీపంలో ఉన్న 67 ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకుంది.

2002 ఏప్రిల్ లో అలహాబాద్ హైకోర్టు ఈ వివాదాలపై వాదనలు వినడం ప్రారంభించింది. ఆ స్థలంలో ప్రార్థనలు చేయడంపై సుప్రీంకోర్టు 2003 మార్చిలో నిషేధం విధించింది. 2009లో జస్టిస్ లిబర్హన్ కమిటీ తన నివేదిక సమర్పించింది. 2010 సెప్టెంబర్ 30న హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వివాదాస్పద ప్రాంతాన్ని మూడు భాగాలుగా చేసి హిందువులకు, ముస్లింలకు, నిర్మోహి అఖారాకు అప్పగించాలని సూచించింది. దీనిపై 2011 మార్చిలో సుప్రీంకోర్టు స్టే విధించింది.

2017 ఆగస్టులో జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం వాదనలు వినడం ప్రారంభించింది. అనంతరం 2019 జనవరిలో ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనానికి ఇది బదిలీ అయింది. అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై విచారణ జరిపింది. మధ్యవర్తిత్వ కమిటీ ఏర్పాటు చేసుకుని సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. 2019 ఆగస్టు 6న సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ ఖలీఫుల్లా నేతృత్వంలో ఏర్పడిన మధ్యవర్తిత్వ కమిటీ తగిన పరిష్కారం చూపలేకపోయింది. దీంతో మళ్లీ ఈ వ్యవహారం కోర్టుకు చేరింది.

40 రోజులపాటు వాదనలు విన్న ధర్మాసనం.. 2019 నవంబర్ 9న కీలకమైన తీర్పు వెలువరించింది. వివాదాస్పద ప్రాంతంలో రాముడి మందిరం నిర్మాణానికి అనుమతించింది. అయోధ్యలోనే తగిన ప్రదేశంలో మసీదు నిర్మాణం కోసం ఐదెకరాల స్థలం ఇవ్వాలని యూపీ సర్కారును ఆదేశించింది.

నిజానికి అయోధ్య వివాదంలో 1990 వరకు జరిగిన సంఘటనలు ఒక ఎత్తైతే.. ఆ తర్వాత జరిగిన సంఘటనలు మరో ఎత్తు. వివాదాస్పద ప్రాంతంలో రాముడి గుడి కట్టాలంటూ విశ్వహిందూ పరిషత్ చేస్తున్న పోరాటానికి మద్దతుగా అప్పటి బీజేపీ జాతీయ అద్యక్షుడు అద్వానీ ప్రారంభించిన రథయాత్ర దేశాన్ని ఓ కుదుపు కుదిపింది. 1990 సెప్టెంబర్ 25న సోమనాథ్ లో ప్రారంభమైన ఈ యాత్ర అనేక గ్రామాలలో సాగింది. అద్వానీ యాత్ర రోజుకు 300 కిలోమీటర్లకు పైగా సాగింది. కరసేవకులు, ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. అప్పట్లో అద్వానీ పేరు మార్మోగిపోయింది. రథయాత్ర సందర్భంగా పలుచోట్ల హింసాత్మక సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో బీహార్ లోని లాలూప్రసాద్ ప్రభుత్వం అద్వానీని అరెస్టు చేసింది. అయినప్పటికీ పలువురు కరసేవకులు అయోధ్య చేరుకున్నారు.

ఈ సందర్భంగా తలెత్తిన హింసలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. తర్వాత బాబ్రీ మసీదును ధ్వంసం చేయడంతో ఆ వివాదం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో తొలిసారిగా అధికారంలోకి వచ్చిన బీజేపీ.. అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిపి తీరతామని పలుమార్లు తమ మేనిఫెస్టోలో ప్రకటించినా అది కార్యరూపం దాల్చలేదు. చివరకు నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో హిందువుల చిరకాల వాంఛ నెరవేరుతోంది. అయోధ్యలో రాముడి ఆలయానికి మూడు దశాబ్దాల క్రితం అద్వానీ రోడ్డు వేయగా.. ఇప్పుడు నరేంద్ర మోదీ ఆ కార్యక్రమాన్ని పూర్తిచేస్తున్నారు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో తప్పించుకుని..

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టును తప్పించుకునేందుకు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy). విరించి వర్మ దర్శకత్వంలో పొలిటికల్ డ్రామాగా...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా: దర్శకుడు వంశీ

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి దర్శకుడిగా తొలి సినిమా. సితార సినిమా...