ప్రపంచ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య చాలా స్పీడ్ గా పెరుగుతోంది. ఇప్పటికే దాదాపుగా కోటిన్నర మంది కరోనా బారిన పడ్డ విషయం తెల్సిందే. ఈ సంఖ్య మరెంతగా పెరుగుతుందో ఆందోళన ప్రతి ఒక్కరిలో వ్యక్తం అవుతోంది. కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు ప్రయోగాలు చేస్తున్నాయి. ఇండియాలో భారత్ బయోటెక్ వ్యాక్సిన్ను తయారు చేసి ప్రస్తుతం క్లినికల్ ట్రయిల్స్ చేస్తున్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ సమయంలోనే రష్యా కరోనా వైరస్ కు వ్యాక్సిన్ను తయారు చేసి క్లినికల్ ట్రయల్స్ను కూడా నిర్వహించినట్లుగా ప్రకటన చేసింది.
రష్యాలోని సెచెనోవ్ మెడికల్ యూనివర్శిటీ వారు కరోనా వ్యాక్సిన్ను తయారు చేసినట్లుగా ప్రకటించారు. కీలకమైన క్లినికల్ ట్రయల్స్ను విజయవంతంగా పూర్తి చేసినట్లుగా పేర్కొన్నారు. జూన్ 18వ తారీకు నుండి మొదలు పెట్టిన క్లినికల్ ట్రయల్స్ పూర్తి అయ్యాయి. జులై 20న క్లినికల్ ట్రయల్స్లో పాల్గొన్న వాలంటీర్లను డిశ్చార్జ్ చేయబోతున్నట్లుగా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ప్రకటించారు.
737807 483165Quite great publish, thanks a great deal for sharing. Do you happen to have an RSS feed I can subscribe to? 352840