మహారాష్ట్రలో కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 31వరకూ ఆ రాష్ట్రంలో లాక్ డౌన్ పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. ఈమేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు కొత్త మార్గదర్శకాలను కూడా రూపొందించారు. ఈ లాక్ డౌన్ సమయంలో అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఇవ్వాలని సూచించారు. ఆంక్షల విషయంలో కఠినంగా ఉండాలని ఉన్నతాధికారులకు సూచించారు. ఈమేరకు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లకు ప్రత్యేక అధికారాలు ఇచ్చింది.
దేశంలో కరోనా రోజురోజుకీ వికృతరూపం దాలుస్తోంది. దేశం మొత్తం మీద ఇప్పటికే 5లక్షల కేసులు నమోదవటం తీవ్ర కలకలం రేపుతోంది. రాష్ట్రాల పరంగా చూస్తే మహారాష్ట్రలో కరోనా కేసులు మొదటి నుంచీ ఎక్కువే నమోదవుతున్నాయి. ఇప్పుడా సంఖ్య మరింతగా పెరిగిపోతోంది. ఆ ఒక్క రాష్ట్రంలోనే 1లక్షా 60వేలకు పైగా కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు.
మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 1,64,626కు చేరుకుంది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 86,575. మృతి చెందిన వారి సంఖ్య 7,429. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 70,622 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు.
322421 649833Hello there. I required to inquire some thingis this a wordpress site as we are thinking about transferring across to WP. Moreover did you make this theme all by yourself? Cheers. 501664
224290 642587Howdy! I just wish to give a huge thumbs up for the fantastic information you might have here on this post. I will probably be coming back to your weblog for much more soon. 850992