Switch to English

నిమ్మగడ్డ ఎందుకు తగ్గినట్టు?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,454FansLike
57,764FollowersFollow

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను కొనసాగించాల్సిందేనని ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించిన వెంటనే తాను చార్జి తీసుకుంటున్నట్టు నిమ్మగడ్డ ప్రకటించారు. ఆ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో తీర్పు వెలువడగా.. నిమిషాల వ్యవధిలో తాను ఎస్ఈసీగా బాధ్యతలు తీసుకుంటున్నట్టు ఆయన పేర్కొన్నారు. వెంటనే ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులకు ఆ మేరకు తెలియజేస్తూ ఉత్తర్వులు వెలువరించారు.

అయితే, శనివారం ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకున్నారు. ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేవరకు శుక్రవారం నాటి ఆదేశాలు ఉపసంహరణలో ఉంటాయని పేర్కొన్నారు. హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే తనకు తానుగా ఎస్ఈసీ చార్జి తీసుకుంటున్నట్టు ప్రకటించుకున్న 24 గంటలు గడిచేలోపే వెనక్కి తగ్గడం చర్చనీయాంశమైంది. వాస్తవానికి కోర్టు తీర్పు వెలువడిన తర్వాత ఆ తీర్పు పూర్తి పాఠం సంబంధిత వ్యక్తులకు చేరడానికి కొంత సమయం పడుతుంది. అందులో ఉన్న అంశాలను బట్టి ఇరు వర్గాలు తదుపరి ఏం చేయాలనే అంశంపై నిర్ణయం తీసుకుంటాయి.

కానీ ఇక్కడ తీర్పు పాఠం రాకముందే నిమ్మగడ్డ కాస్త తొందరపడి తనంత తానుగా చార్జి తీసుకున్నారు. తీర్పు పూర్తి పాఠం తమకు అందగానే అడ్వొకేట్ జనరల్ కొన్ని సందేహాలు లేవనెత్తారు. నిమ్మగడ్డను చార్జి తీసుకోవాల్సిందిగా హైకోర్టు ఆదేశించలేదని, అందువల్ల ఆయన తనకు తానుగా ఎస్ఈసీగా ప్రకటించుకోవడం హైకోర్టు తీర్పుకు విరుద్ధమని పేర్కొన్నారు.

అసలు హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం 1994 తర్వాత జరిగిన నియామకాలు ఏవీ కూడా చెల్లవని కొత్త పాయింటు లేవనెత్తారు. అంతేకాకుండా తాము ఈ తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్నామని, అందుకు వీలుగా తీర్పు అమలుపై స్టే విధించాలని ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు చెప్పారు.

నిజానికి నిమ్మగడ్డను ఆ పోస్టు నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు వాటిని రద్దు చేస్తూ తిరిగి ఆయన్ను ఎస్ఈసీగా కొనసాగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ప్రభుత్వమే ఆ మేరకు ఉత్తర్వులు వెలువరించాల్సి ఉంటుంది. కానీ సర్కారు ఉత్తర్వులు ఇవ్వకుండానే నిమ్మగడ్డ తనకు తానుగా ఎస్ఈసీగా ప్రకటించుకోవడం చెల్లదు. దీంతో ఈ మేరకు ఏజీ సందేహాలు వ్యక్తంచేసిన కొద్దిసేపటికే నిమ్మగడ్డ తన ఉత్తర్వులను ఉపసంహరించుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన...

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు....

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

రాజకీయం

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

ఎక్కువ చదివినవి

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

Viral News: మాజీ క్రికెటర్ పై చిరుత దాడి.. పోరాడి కాపాడిన పెంపుడు శునకం

Viral News: పెంపుడు జంతువులు మనుషులపై ఎంతటి ప్రేమ చూపిస్తాయో తెలిపేందుకు జింబాబ్వేలో జరిగిన ఘటనే నిదర్శనం. జింబాబ్వే (zimbabwe) మాజీ క్రికెటర్ గయ్ విట్టల్ (Guy Whittal) పై చిరుతపులి దాడి...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు మల్లి అంకం

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఆ ఒక్కటీ అడక్కు’...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు. అంతటి స్టార్ డమ్ చూసిన నటి...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...