Switch to English

తెలంగాణలో భయపెడ్తున్న ‘కరోనా’ మరణాలు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,453FansLike
57,764FollowersFollow

పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌తో పోల్చితే కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తెలంగాణలో తక్కువే వుంది. కానీ, ఆంధ్రప్రదేశ్‌తో పోల్చి చూసినప్పుడు తెలంగాణలో కరోనా టెస్టులు తక్కువగా జరుగుతున్నాయి. కరోనా పరీక్షలు తక్కువగా చేస్తుండడంపై న్యాయస్థానం తెలంగాణ ప్రభుత్వానికి చురకలంటించిన విషయం విదితమే. అయితే, ఐసీఎంఆర్‌ సూచనలు మేరకు మాత్రమే కరోనా టెస్టులు చేస్తున్నట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ చెబుతున్నారు.

మరోపక్క గత కొద్ది రోజులుగా కరోనా మరణాలు తెలంగాణలో పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో నిన్నటి వరకు కరోనా మరణాల సంఖ్య 59 కాగా, తెలంగాణలో ఆ సంఖ్య 67గా నమోదయ్యింది. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,245 కాగా, తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,256.

ఇదిలా వుంటే, ఆరోగ్యం విషమించాక ఆసుపత్రులకు వస్తుండడం వల్లే కరోనా మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయన్నది తెలంగాణలో విన్పిస్తోన్న ఇంకో వెర్షన్‌. అయితే, పరీక్షల సంఖ్య పెరిగితే, ముందుగానే కరోనా పాజిటివ్‌ రోగుల్ని గుర్తించడం సాధ్యమవుతుందనీ, అలా జరిగినప్పుడే కరోనా మరణాల్ని నివారించడానికీ వీలవుతుందన్నది విపక్షాల వాదన.

తెలంగాణలో జీహెచ్‌ఎంసీ మినహా ఇతర జిల్లాల్లో కరోనా అదుపులోనే వుంది. అయినాగానీ, తెలంగాణకి గుండెకాయ లాంటి జీహెచ్‌ఎంసీ ప్రాంతంలో సుమారు కోటి జనాభా వున్న దరిమిలా, ఇక్కడ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతుండడంతో ప్రజల్లో ఆందోళన పెరిగిపోతోంది.

లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత తెలంగాణకు కరోనా తాకిడి మరింత ఎక్కువైంది. విదేశాల నుంచీ, పొరుగు రాష్ట్రాల నుంచీ వస్తున్నవారి కారణంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్న విషయం విదితమే. ఇదిలా వుంటే, మే 31తో తెలంగాణలో లాక్‌డౌన్‌ ముగియనున్న, మళ్ళీ లాక్‌డౌన్‌ని పొడిగించడం వైపే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం లాక్‌డౌన్‌ అమల్లో వున్నా అనేక సడలింపుల నేపథ్యంలో లాక్‌డౌన్‌ ఛాయలు దాదాపుగా కన్పించడంలేదనే చెప్పాలి. దేశవ్యాప్తంగా జూన్‌ 1 నుంచి మరిన్ని సడలింపులు రానున్న దరిమిలా, లాక్‌డౌన్‌ని కొనసాగించినా.. దాన్ని లాక్‌డౌన్‌గా పరిగణించలేని పరిస్థితి నెలకొంటుంది.

10 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు....

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన...

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు....

రాజకీయం

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

ఎక్కువ చదివినవి

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. నేడు ఆమె పుట్టినరోజు...

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన రెండు సినిమాలు బాక్సాఫీస్ ను...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో విడుదలవుతున్న సినమాపై ఫరియా తన అనుభవాలు...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు మల్లి అంకం

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఆ ఒక్కటీ అడక్కు’...