అధికారంలో ఎవరున్నా భజన కార్యక్రమాలు తప్పవు. విద్యార్థులతోనూ, సాధారణ ప్రజలతోనూ.. పొగిడించుకోవడం పాలకులకు అలవాటే. వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలోనూ, చంద్రబాబు హయాంలోనూ ఇలాంటివి చాలానే చూశాం. ఇప్పుడు వైఎస్ జగన్ హయాంలోనూ చూస్తున్నాం.
ఓ విద్యార్థిని, తాను పెద్దయ్యాక.. వైఎస్ జగన్ మంత్రి వర్గంలో పనిచేయాలనుకుంటున్నట్లు.. స్వయంగా వైఎస్ జగన్ సమక్షంలోనే చెప్పారు. జగన్ ఆ సమయంలో ముసిముసి నవ్వులు నవ్వేశారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థిని ఆమె. ఉన్నత చదువులు చదివినవారు రాజకీయాల్లోకి వస్తామంటే ఆహ్వానించాల్సిందే. కానీ, ప్రస్తుతం రాజకీయాలెలా వున్నాయ్.? ఉన్నత విద్యను అభ్యసించినవారు సైతం దిగజారుడు రాజకీయాలు చేస్తున్న రోజులివి.
ఇక, సదరు పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థిని ‘మంత్రి పదవి’ చుట్టూ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో బీభత్సమైన ట్రోలింగ్ జరుగుతోంది. ‘ఇలాంటి భజనపరులతో భజన చేయించుకోవడానికేనా మన పాలన – మీ సూచన’ పేరుతో పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నది.? అంటూ వైసీపీ వ్యతిరేక వర్గం ప్రశ్నిస్తోంది. గతంలో చంద్రబాబు హయాంలో ఇలాంటివి జరిగినప్పుడు వైసీపీ శ్రేణులూ ఇలాగే ట్రోల్ చేశాయనుకోండి.. అది వేరే విషయం.
లబ్దిదారులు ప్రభుత్వాల్ని ప్రశంసించడంలో ఆశ్చర్యమేముంటుంది.? కానీ, ఆ ప్రశంసలో ‘పబ్లిసిటీ స్టంట్లు’ కన్పిస్తుండడమే ఆక్షేపణీయం. చాలా సందర్భాల్లో కింది స్థాయి నేతలే కాదు, అధికారులు కూడా ప్రభుత్వానికి భజన చేసేవారిని ఎంపిక చేసుకుని మరీ ఈ తరహా కార్యక్రమాలకు తరలిస్తుంటారు. ‘మన పాలన – మీ సూచన’ కార్యక్రమంలోనూ అదే జరుగుతోందని టీడీపీ ఆరోపిస్తోంది. టీడీపీ ఆరోపణల్ని వైసీపీ గట్టిగానే తిప్పి కొడుతోందనుకోండి.. అది వేరే విషయం.
గతంలో తాము ఏ పద్ధతినైతే విమర్శించామో, ఇప్పుడు అదే పద్ధతిని ప్రోత్సహిస్తూ.. వైఎస్ జగన్ మోహన్రెడ్డి.. ముఖ్యమంత్రిగా ఏం సంకేతాలు పంపుతున్నట్లు.? అన్న ప్రశ్న రాజకీయ విశ్లేషకుల నుంచి దూసుకొస్తోంది. మొత్తమ్మీద, ఈ తరహా పబ్లిసిటీ స్టంట్స్ విషయంలో చంద్రబాబు పాలనని వైఎస్ జగన్ పాలన మించిపోతోందన్నమాట. ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో వైఎస్ జగన్ సర్కార్, ‘మన పాలన – మీ సూచన’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం విదితమే.
825236 844874never saw a site like this, relaly impressed. compared to other blogs with this post this was definatly the best website. will save. 472262