ఆల్ టైం బ్లాక్ బస్టర్ ‘బాహుబలి’ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అంటే అతనొక పాన్ ఇండియా స్టార్. అందుకే తన నుంచి వచ్చే సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలోనే రూపొందుతున్నాయి. ప్రభాస్ రాధాకృష్ణ డైరెక్షన్ లో చేస్తున్న పీరియడ్ లవ్ స్టోరీ సెట్స్ పై ఉంది. ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకున్నప్పటికీ కరోనా ఎఫెక్ట్ వలన ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఇది కాకుండా ప్రభాస్ ఇప్పటికే నాగ్ అశ్విన్ డైరెక్షన్ ఓ భారీ పాన్ ఇండియా ఫిల్మ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు.
ఈ క్వారంటైన్ టైంలో నాగ్ అశ్విన్ కథని పక్కాగా సిద్ధం చేసాడని, ఇక ప్రభాస్ కి వినిపించడమే బాలన్స్ అని ఇది వరకే తెలిపాము. లేటెస్ట్ గా ఈ చిత్ర నిర్మాత అశ్వినీదత్ ఈ సినిమా రిలీజ్ ఎప్పుడనేది అనౌన్స్ చేశారు. ‘ఫస్ట్ నాగ్ అశ్విన్ చెప్పిన కథ విని సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాను. మినిమమ్ 100 కోట్ల ప్రాజెక్ట్ అనుకునేలోపు, నాగ్ అశ్విన్ ఈ కథకి ప్రభాస్ అయితేనే కరెక్ట్ అన్నాడు. ప్రభాస్ తో మీటింగ్, తను విన్న వెంటనే ఓకే చేసేసాడు. ఈ పాన్ ఇండియా సినిమాని 2020 అక్టోబర్ లో అధికారికంగా ప్రారంభించి 2022 ఏప్రిల్ లో సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేశామని’ నిర్మాత అశ్వినీదత్ తెలిపారు.
బాహుబలి కోసం 4 ఏళ్ళు పైనే, ఆ తర్వాత సాహో కోసం రెండేళ్లు, ఇప్పుడు ‘ఓ డియర్(వర్కింగ్ టైటిల్)’ కోసం కూడా రెండుళ్లు, నాగ్ అశ్విన్ ఫిలిం కోసం 2022 అంటే సుమారు ఏడాది పైనే వెయిట్ చేయాలి.. మరి ఒక్కో సినిమాకి ఒక సంవత్సరం పైనే ప్రభాస్ అభిమానులు తమ హీరో సినిమా కోసం వెయిట్ చేయాల్సి రావడం బాధాకరమైన విషయం.
260006 434587hello I was quite impressed with the setup you used with this internet site. I use blogs my self so excellent job. definatly adding to bookmarks. 361546