Switch to English

కరోనా వేళ.. రాజకీయాలేల?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,454FansLike
57,764FollowersFollow

సమస్త మానవాళిని వణికిస్తున్న కరోనాను ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలన్నీ పాట్లు పడుతున్నాయి. ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి అందరూ కలిసికట్టుగా ఉండాలని పలువురు ప్రముఖులు పిలుపునిస్తూనే ఉన్నారు. మన దేశానికి వస్తే.. ప్రస్తుతం ఈ వైరస్ విజృంభణ ఇంకా కొనసాగుతూనే ఉంది. దీనిని అరికట్టడానికి రాష్ట్రాలు కిందా మీదా పడుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితి మెరుగ్గా ఉండగా.. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం భయంకరంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఏపీ నేతలు రాజకీయాలు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అధికార పక్షంపై ప్రతిపక్షాలు, ప్రతిపక్షాలపై అధికార పక్షం తీవ్రమైన ఆరోపణలు చేసుకుంటున్నాయి. వేగంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారిని అరికట్టే దిశగా చర్యలు తీసుకోకుండా రాజకీయపరమైన అంశాలకే రెండు పక్షాలు ప్రాధాన్యత ఇవ్వడంపై పలువురు మండిపడుతున్నారు. ఈ విషయంలో విపక్షాలు ప్రభుత్వానికి అండగా ఉండకపోయినా పర్లేదు.. రాజకీయాలు చేయకుండా ఉంటే చాలని అంటున్నారు. అలాగే అధికార పక్షం కూడా విపక్షాలపై చౌకబారు విమర్శలు చేయకుండా కరోనా కట్టడికి కృషి చేయాలని సూచిస్తున్నారు. ఈ విషయంలో కేరళను చూసి చాలా నేర్చుకోవాలని పేర్కొంటున్నారు.

కరోనాను కట్టడి చేయడంలో కేరళ అనుసరించిన విధానాలు చాలా రాష్ట్రాలకు ఆదర్శంగా ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కరోనా అలర్ట్ రాగానే ముందుగా స్పందించిన కేరళ.. వెంటనే తగిన చర్యలు చేపట్టింది. రూ.20వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రతిపక్ష నేతతో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారంటే ఆయన ఎంతటి పరిణితి చెందిన నాయకుడో అర్థం చేసుకోవచ్చు.

ఇలాంటి సంఘటనను మన తెలుగు రాష్ట్రాల్లో కనీసం ఊహించుకునే పరిస్థితి కూడా ఉండదు. ఏపీలో అయితే అధికార, విపక్షాల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం చూస్తుంటే.. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఈ నేతలు మారరా అని అనిపించక మానదు. ప్రధాని మోదీ సైతం విపక్ష నేతల అభిప్రాయాలు తీసుకుని ముందుకెళ్తున్నారు. వివిధ పక్షాల నేతలు సైతం కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయకుండా నిర్మాణాత్మక సూచనలు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కావాల్సింది ఇదే. కానీ తెలంగాణ, ఏపీల్లో దీనిని ఊహించే సాహసం కూడా చేయలేం.

తెలంగాణలో కేసుల సంఖ్య బాగా తగ్గింది. త్వరలోనే ఒక్క పాజిటివ్ కేసు కూడా లేని రాష్ట్రంగా తెలంగాణ మారనుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కానీ ఏపీలో మాత్రం కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. రోజుకు కనీసం 80 కేసులు నమోవుతున్నాయి. ప్రస్తుతం ఏపీలో పాజిటివ్ కేసుల సంఖ్య 1259కి చేరింది. ఈ నేపథ్యంలో అక్కడ ఈ వైరస్ కట్టడికి ప్రభుత్వం మరింత గట్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని పలువురు పేర్కొంటున్నారు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన...

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు....

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

రాజకీయం

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

ఎక్కువ చదివినవి

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు. అంతటి స్టార్ డమ్ చూసిన నటి...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. నేడు ఆమె పుట్టినరోజు...

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు మేకర్స్. ఈక్రమంలోనే టాలీవుడ్, బాలీవుడ్ కి...