Switch to English

కరోనాపై జగన్‌ ప్రసంగం.. ఇంత చప్పగానా.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

కరోనా వైరస్‌ (కోవిడ్‌-19)ని సాధారణ జ్వరంగా ఇంకోసారి తేల్చేశారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి. ‘కరోనా వైరస్‌తో మనం కొన్నాళ్ళు జీవించాల్సి వస్తుంది..’ అనే మాట నిజమే అయినా, ఆ విషయం చెప్పే క్రమంలో ముఖ్యమంత్రిలో సీరియస్‌నెస్‌ కన్పించకపోతే, సాధారణ ప్రజానీకానికి తప్పుడు సంకేతాలు వెళ్ళకుండా వుంటాయా.? ‘సాధారణ జ్వరం’ అనే మాట నిజంగానే తప్పుడు సంకేతాల్ని పంపుతోంది జనంలోకి. అదే, ఆంధ్రప్రదేశ్‌లో లాక్‌డౌన్‌ని జనం సీరియస్‌గా తీసుకోకపోవడానికి కారణమన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.

ఇంకోపక్క, రికార్డు స్థాయిలో టెస్టులు చేసేశామంటూ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం పదే పదే తన ‘ఘనతను’ చాటుకునే ప్రయత్నం చేయడం హాస్యాస్పదమే. 10 లక్షల మందికి సుమారు 1300 పరీక్షలు చేయడమంటే.. నిజంగానే సిగ్గుపడాల్సిన విషయం. రాష్ట్రం వరకూ ఇది పెద్ద సంఖ్యే కావొచ్చుగాక.. ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు. కానీ, 10 లక్షల మందిలో 1300 మందికి కరోనా పరీక్షలంటే.. అది ఎంత హాస్యాస్పదం.? ఇక్కడ తగిన వనరులు లేవన్నది నిర్వివాదాంశం. అలాంటప్పుడు ఆ చిన్న ఫిగర్‌ని పదే పదే ఘనతగా చెప్పుకోవడం అస్సలేమాత్రం సబబు కాదు.

కరోనా వైరస్‌ని మహమ్మారిగా వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ ప్రకటించాక.. దాన్ని ‘చిన్న జ్వరం లాంటిది’ అని ఓ ముఖ్యమంత్రి ఎలా అనగలుగుతారు.? కరోనా వైరస్‌ దెబ్బకి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. రానున్న రోజుల్లో మరణాల సంఖ్య ఇంకా పెరగబోతోంది. ఆర్థికంగా రాష్ట్రానికి జరుగుతున్న నష్టం అంతా ఇంతా కాదు. ఇంత ప్రమాదకర పరిస్థితుల్లో ప్రజల్ని మరింత అప్రమత్తం చేయాల్సింది పోయి.. తమ ప్రభుత్వ గొప్పలు చెప్పుకోవడానికి ‘ప్రెస్‌మీట్‌’ పేరుతో ‘రికార్డెడ్‌’ ప్రసంగం లాంటిది చేస్తే ఎలా.?

నిజమే, రానున్న రోజుల్లో కరోనా వైరస్‌తో మనం కొంతకాలమైనా సహజీవనం చేయాల్సిందే. వేరే దారి లేదు. మరి, ప్రజల్ని అందుకు సన్నద్ధం చేసే పద్ధతి ఇదేనా.? అన్నదే ఇక్కడ కీలకం. ప్రజల బాగోగులు చూడాల్సిన బాధ్యతను వదిలేసి, అధికార పక్షం ఫక్తు రాజకీయాలు చేస్తూ, విపక్షాలపై ‘స్లీపర్‌ సెల్స్‌’ అంటూ దిక్కుమాలిన ఆరోపణలు చేయడంలోనే.. ప్రభుతంలో వున్నవారికి ప్రజల పట్ల వున్న బాధ్యత ఏంటో అర్థమవుతోంది. కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌ పెడితే.. అందులో ప్రజలకు భరోసా కన్పిస్తుంటుంది. అధికారుల్ని, మంత్రుల్ని తన వెంట తీసుకొచ్చి మరీ సుదీర్ఘంగా మాట్లాడతారు కేసీఆర్‌. ఆ హుందాతనం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిలో మచ్చుకైనా కన్పించదేం.?

కరోనా పై పోరాటంలో భాగంగా ఈ నెలరోజుల్లో టెస్టింగ్ సామర్ధ్యాన్ని పెంచుకోగలిగాం. దేశంలోనే అత్యధిక కోవిడ్ టెస్టులు చేస్తున్న రాష్ట్రంగా ఏపీ ఉంది. ఈ నెలరోజుల్లో వైద్య సదుపాయాలను పెంచుకుని ఆరోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయగలిగాం.As a part of Andhra Pradesh's fight against Corona Virus, we have ramped up the testing capacity substantially so far this month. AP is conducting the highest number of COVID tests per million population in the country. With the expansion in health infrastructure, we are able to strengthen the health care system in the state.

Geplaatst door YS Jagan Mohan Reddy op Maandag 27 april 2020

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం ప్రముఖంగా వార్తల్లో నిలుస్తున్నారు. కారణం.. రాజమౌళి...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ చూస్తారు: అల్లరి నరేశ్

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో అల్లరి నరేశ్ (Allari Naresh) అన్నారు....

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...