Switch to English

కరోనాపై జగన్‌ ప్రసంగం.. ఇంత చప్పగానా.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

కరోనా వైరస్‌ (కోవిడ్‌-19)ని సాధారణ జ్వరంగా ఇంకోసారి తేల్చేశారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి. ‘కరోనా వైరస్‌తో మనం కొన్నాళ్ళు జీవించాల్సి వస్తుంది..’ అనే మాట నిజమే అయినా, ఆ విషయం చెప్పే క్రమంలో ముఖ్యమంత్రిలో సీరియస్‌నెస్‌ కన్పించకపోతే, సాధారణ ప్రజానీకానికి తప్పుడు సంకేతాలు వెళ్ళకుండా వుంటాయా.? ‘సాధారణ జ్వరం’ అనే మాట నిజంగానే తప్పుడు సంకేతాల్ని పంపుతోంది జనంలోకి. అదే, ఆంధ్రప్రదేశ్‌లో లాక్‌డౌన్‌ని జనం సీరియస్‌గా తీసుకోకపోవడానికి కారణమన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.

ఇంకోపక్క, రికార్డు స్థాయిలో టెస్టులు చేసేశామంటూ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం పదే పదే తన ‘ఘనతను’ చాటుకునే ప్రయత్నం చేయడం హాస్యాస్పదమే. 10 లక్షల మందికి సుమారు 1300 పరీక్షలు చేయడమంటే.. నిజంగానే సిగ్గుపడాల్సిన విషయం. రాష్ట్రం వరకూ ఇది పెద్ద సంఖ్యే కావొచ్చుగాక.. ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు. కానీ, 10 లక్షల మందిలో 1300 మందికి కరోనా పరీక్షలంటే.. అది ఎంత హాస్యాస్పదం.? ఇక్కడ తగిన వనరులు లేవన్నది నిర్వివాదాంశం. అలాంటప్పుడు ఆ చిన్న ఫిగర్‌ని పదే పదే ఘనతగా చెప్పుకోవడం అస్సలేమాత్రం సబబు కాదు.

కరోనా వైరస్‌ని మహమ్మారిగా వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ ప్రకటించాక.. దాన్ని ‘చిన్న జ్వరం లాంటిది’ అని ఓ ముఖ్యమంత్రి ఎలా అనగలుగుతారు.? కరోనా వైరస్‌ దెబ్బకి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. రానున్న రోజుల్లో మరణాల సంఖ్య ఇంకా పెరగబోతోంది. ఆర్థికంగా రాష్ట్రానికి జరుగుతున్న నష్టం అంతా ఇంతా కాదు. ఇంత ప్రమాదకర పరిస్థితుల్లో ప్రజల్ని మరింత అప్రమత్తం చేయాల్సింది పోయి.. తమ ప్రభుత్వ గొప్పలు చెప్పుకోవడానికి ‘ప్రెస్‌మీట్‌’ పేరుతో ‘రికార్డెడ్‌’ ప్రసంగం లాంటిది చేస్తే ఎలా.?

నిజమే, రానున్న రోజుల్లో కరోనా వైరస్‌తో మనం కొంతకాలమైనా సహజీవనం చేయాల్సిందే. వేరే దారి లేదు. మరి, ప్రజల్ని అందుకు సన్నద్ధం చేసే పద్ధతి ఇదేనా.? అన్నదే ఇక్కడ కీలకం. ప్రజల బాగోగులు చూడాల్సిన బాధ్యతను వదిలేసి, అధికార పక్షం ఫక్తు రాజకీయాలు చేస్తూ, విపక్షాలపై ‘స్లీపర్‌ సెల్స్‌’ అంటూ దిక్కుమాలిన ఆరోపణలు చేయడంలోనే.. ప్రభుతంలో వున్నవారికి ప్రజల పట్ల వున్న బాధ్యత ఏంటో అర్థమవుతోంది. కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌ పెడితే.. అందులో ప్రజలకు భరోసా కన్పిస్తుంటుంది. అధికారుల్ని, మంత్రుల్ని తన వెంట తీసుకొచ్చి మరీ సుదీర్ఘంగా మాట్లాడతారు కేసీఆర్‌. ఆ హుందాతనం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిలో మచ్చుకైనా కన్పించదేం.?

కరోనా పై పోరాటంలో భాగంగా ఈ నెలరోజుల్లో టెస్టింగ్ సామర్ధ్యాన్ని పెంచుకోగలిగాం. దేశంలోనే అత్యధిక కోవిడ్ టెస్టులు చేస్తున్న రాష్ట్రంగా ఏపీ ఉంది. ఈ నెలరోజుల్లో వైద్య సదుపాయాలను పెంచుకుని ఆరోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయగలిగాం.As a part of Andhra Pradesh's fight against Corona Virus, we have ramped up the testing capacity substantially so far this month. AP is conducting the highest number of COVID tests per million population in the country. With the expansion in health infrastructure, we are able to strengthen the health care system in the state.

Geplaatst door YS Jagan Mohan Reddy op Maandag 27 april 2020

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

ఎక్కువ చదివినవి

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్ అంటున్న మేకర్స్

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad Square) తెరకెక్కబోతోంది. యూత్ ఓరియంటెడ్ మూవీస్...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

పిఠాపురంలో వంగా గీతకు అదే పెద్ద మైనస్.!

నామినేషన్ల పర్వం షురూ అయ్యింది.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 23న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. పిఠాపురంలో జనసేనాని పోటీ చేస్తున్నారని కన్ఫామ్ అయినప్పటికీ, ఇప్పటికీ.....

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...