గత కొన్ని రోజులుగా మలయాళ మూవీ అయ్యప్పనుమ్ కోశియుమ్ సినిమా గురించి మీడియాలో ప్రముఖంగా వార్తలు వినిపిస్తున్నాయి. మల్టీస్టారర్ సినిమా అయిన ఇది మలయాళంలో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగులో ఈ సినిమాను రీమేక్ చేసేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ వారు రైట్స్ను దక్కించుకున్నారు. ఈమద్య కాలంలో ఈ బ్యానర్లో వరుసగా సినిమాలు వస్తున్నాయి. ఇటీవల వచ్చిన భీష్మ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
ఈ జోరులోనే అయ్యప్పనుమ్ కోశియుమ్ చిత్రాన్ని మల్టీస్టారర్గా రీమేక్ చేయాలని భావిస్తున్నారు. అయితే హీరోల విషయంలో నిర్మాతలు కష్టాలు ఎదుర్కొంటున్నట్లుగా తెలుస్తోంది. టాలీవుడ్లో మల్టీస్టారర్ మూవీస్ అంటే మామూలు విషయం కాదు. ఎంతో మంది హీరోలు కూడా మల్టీస్టారర్స్కు ఒప్పుకునే పరిస్థితి లేదు. మొదట ఈ ప్రాజెక్ట్ బాలయ్య వద్దకు వెళ్లిందని సమాచారం అందుతోంది. కాని బాలయ్య ప్రస్తుతం తాను ఉన్న బిజీలో ఆ సినిమాను చేయాలంటే రెండేళ్లు ఆగాలన్నాడట. దాంతో మరో హీరోను వెదికే పనిలో పడ్డారు.
నిర్మాతలు వెంకటేష్ వద్దకు వచ్చి ఆగినట్లుగా తెలుస్తోంది. వెంకటేష్ గతంలో పలు రీమేక్ చిత్రాలు చేసి సక్సెస్ దక్కించుకున్నాడు. అలాగే ఈ సినిమాలో రానాతో వెంకీ కలిసి నటిస్తే సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. అందుకే మరో ఆలోచన లేకుండా ఈ భారీ మల్టీస్టారర్ రీమేక్కు వెంకటేష్ను తీసుకోవాలని నిర్మాతలు భావిస్తున్నారట. కాని వెంకటేష్ ఏం ఆలోచిస్తున్నాడు అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు.
138543 804941Youre so cool! I dont suppose Ive read anything in this way before. So good to uncover somebody with some original ideas on this topic. realy appreciate starting this up. this excellent site is something that is necessary over the internet, a person if we do originality. valuable function for bringing something new towards the internet! 217242