Switch to English

వైఎస్‌ జగన్‌, బీజేపీని ‘సవాల్‌’ చేయగలరా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలు వాయిదా పడటానికి కారణం ఎవరు.? రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి చెబుతున్నదాన్ని బట్టి, కరోనా వైరస్‌ వల్లనే స్థానిక ఎన్నికలు వాయిదా పడ్డాయి. కానీ, అధికార వైఎస్సార్సీపీ వాదన ఇంకోలా వుంది. చంద్రబాబు కుట్రతోనే స్థానిక ఎన్నికలు ఆగిపోయాయని వైసీపీ అంటోంది.

కరోనా వైరస్‌ సంగతి పక్కన పెడితే, రాష్ట్రంలో అసలు స్థానిక ఎన్నికల ప్రక్రియ సజావుగా నడవడంలేదన్నది నిర్వివాదాంశం. ముఖ్యమంత్రి చెప్పినదాన్ని బట్టి చూసినా, 45 చోట్ల చెదురుమదురు సంఘటనలు జరిగాయి. వాస్తవ కోణంలో చూస్తే, పరిస్థితులు అత్యంత దారుణంగా తయారయ్యాయి.

వైసీపీ కార్యకర్తలు, చాలా చోట్ల టీడీపీగానీ, జనసేనగానీ, బీజేపీగానీ, వామపక్షాలుగానీ నామినేషన్లు వేయకుండా చేశారు. మహిళలని కూడా చూడకుండా అభ్యర్థుపై దాడులకు తెగబడ్డారు. ఏకంగా ఓ న్యాయవాది నెత్తి పగలగొట్టేశారు వైసీపీ కార్యకర్తలు. తమ పార్టీకి చెందిన కార్యకర్తలు ఇలా పెట్రేగిపోతోంటే, ముఖ్యమంత్రి ‘చెదురుమదురు సంఘటనలు’ అని లైట్‌ తీసుకోవడమేంటి.?

అసలు ఎన్నికలు సజావుగా సాగడంలేదు.. తక్షణం ఎన్నికలు నిలిపేయాలంటూ బీజేపీ నేతలు నినదించారు. కానీ, ఆ దిశగా ముఖ్యమంత్రి నుంచిగానీ, అధికార వైసీపీ ముఖ్య నేతల నుంచిగానీ బీజేపీ మీద ఒక్కటంటే ఒక్క విమర్శ కూడా రాలేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ మీద మాత్రం ‘చంద్రబాబు తొత్తు’ అనే విమర్శలు చేస్తున్నారు. ఏం, అదే ‘తొత్తు’ అన్న పదాన్ని, ప్రధాన మంత్రి మీదనో, బీజేపీ జాతీయ అధ్యక్షుడి మీదనో ఎందుకు ప్రయోగించడంలేదు.? అలా ప్రయోగిస్తే, ఆ తర్వాత ఏం జరుగుతుందో వైసీపీ నేతలకు బాగా తెలుసు.

నామినేషన్లు వేసే అవకాశం రాజకీయ పార్టీలకు లేనప్పుడు, అసలు అది ఎన్నిక ఎలా అవుతుంది.? ‘టీడీపీకి అభ్యర్థులే దొరకడంలేదు..’ అని వైసీపీ నేతలు చేస్తున్న విమర్శల్లో నిజమెంతో ఆ పార్టీ నేతలకే బాగా తెలుసు. కేంద్ర ప్రభుత్వ స్థాయి అధికారులతో చర్చలు జరిపిన తర్వాతనే, ఎన్నికల వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ప్రకటించిన దరిమిలా, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి ‘చేవ’ వుంటే, ‘చేతనైతే’, కేంద్రాన్ని నిలదీయాలి. కానీ, అలా ప్రశ్నించే ధైర్యం ఆయనకుందా.? కరోనా వైరస్ పట్ల ఆందోళన అవసరం లేదు, పారాసిటమాల్ – బ్లీచింగ్ పౌడర్ సరిపోతుందని ప్రధానికి వైఎస్ జగన్ సవాల్ విసిరే పరిస్థితి వుందా.?

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

బర్త్ డే స్పెషల్ : రౌడీ స్టార్‌ టు ఫ్యామిలీ స్టార్‌

2012 లో వచ్చిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ 2015 లో మొదటి సారి మెయిన్ లీడ్‌ రోల్‌ ను ఎవడే సుబ్రహ్మణ్యంలో చేశాడు. ఆ...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...