Switch to English

ప్రోరోగ్ వ్యూహం ఫలించేనా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,431FansLike
57,764FollowersFollow

ఏపీ అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను ఆమోదించుకునే విషయంలో అధికార వైఎస్సార్ సీపీ అందుబాటులో ఉన్న అన్ని వ్యూహాలనూ అమలు చేస్తోంది. వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు తెలుగుదేశం పార్టీ ప్రతి వ్యూహాలు పన్నుతోంది. ఈ క్రమంలో శాసనసభ, శాసనమండలిని ప్రోరోగ్ చేస్తూ గురువారం సాయంత్రం గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో తెలుగుదేశం పార్టీలో కలకలం మొదలైంది.

మండలి సెలెక్ట్ కమిటీకి పంపించిన బిల్లులపై ఆర్డినెన్స్ తీసుకొచ్చేందుకే అసెంబ్లీని ప్రోరోగ్ చేసినట్టు అంచనాకు వచ్చింది. దీంతో ప్రతివ్యూహం చేసుకునే దిశగా కసరత్తు మొదలుపెట్టింది. నిజానికి ఆ బిల్లుల విషయంలో 14 రోజులు గడిచిపోయినందున పాస్ అయిపోయినట్టుగానే భావించొచ్చని అధికార పార్టీ తన వాదన వినిపిస్తోంది. కానీ టీడీపీ దీనిని అంగీకరించడంలేదు. మనీ బిల్లుల విషయంలోనే 14 రోజుల నిబంధన వర్తిస్తుందని, సాధారణ బిల్లుల విషయంలో నాలుగు నెలల సమయం ఉంటుందని, ఈ విషయం కూడా అధికార పార్టీకి తెలియడంలేదని టీడీపీ ఎద్దేవా చేస్తోంది.

ఈ నేపథ్యంలోనే ఈ తలనొప్పులు ఎందుకని భావించిన వైసీపీ.. అసెంబ్లీని ప్రోరోగ్ చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేయించింది. అసెంబ్లీ ప్రోరోగ్ లో ఉన్న సమయంలో ఏ బిల్లు పై అయినా ఆర్డినెన్స్ తెచ్చుకునే వెసులుబాటు అధికార పార్టీకి ఉంటుంది. అనంతరం ఆరు నెలల లోపు దానిని సభలో ఆమోదించుకోవాలి. సరిగ్గా ఈ నిబంధననే వినియోగించుకుని వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుపై ఆర్డినెన్స్ తేవాలని సర్కారు యోచిస్తున్నట్టు చెబుతున్నారు.

అయితే, వీటిపై ఆర్డినెన్స్ తెచ్చినా.. బడ్జెట్ సమావేశాల్లో ఆమోదించాల్సిందేనని టీడీపీ వాదిస్తోంది. ఆర్డినెన్స్ కాలపరిమితి ఆరు నెలలు ఉంటుందని, ఆలోగా ఎప్పుడైనా ఆమోదించుకోవచ్చని వైసీపీ పేర్కొంటోంది. ఒకవేళ ఆరు నెలల కాలపరిమితి ముగిసే సమయానికి అసెంబ్లీ ప్రోరోగ్ లోనే ఉంటే, అప్పుడు మరోసారి ఆర్డినెన్స్ ను పొడిగించొచ్చు. ఇలా మండలిలో బిల్లులు ఆమోదం పొందే సంఖ్యాబలం తమకు వచ్చే వరకు ఆర్డినెన్స్ పొడిగించుకునే అవకాశమూ అధికార పార్టీకి ఉంది. ఈ విషయంలో వైసీపీ వ్యూహం ఎంతవరకు విజయవంతం అవుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

ఎక్కువ చదివినవి

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన మంచు...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను : చిరంజీవి

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత కొంత సమయం సరదాగా...