Switch to English

కడప ఉక్కుకి రాజకీయ ‘తుప్పు’ వదిలేనా.?’

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ని పరిపాలించినవారిలో ఎక్కువమంది రాయలసీమ ప్రాంతానికి చెందినవారే. అందునా, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, చంద్రబాబు.. రాయలసీమ ప్రాంతానికి చెందినవారే. కడప జిల్లాకే చెందిన వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తన హయాంలో కడప ఉక్కు పరిశ్రమకి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు కూడా కడప ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. తాజాగా, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి కూడా ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేశారు.

వైఎస్‌ హయాంలో శంకుస్థాపన జరిగితే, ఆ తర్వాత పనులు ప్రారంభమై, పూర్తయిపోవాలి కూడా. ఎవరు అధికారంలో వున్నా కడప ఉక్కు పరిశ్రమ గురించి మాట్లాడటం ఆనవాయితీగా మారిపోయింది. పనులు మాత్రం ఇప్పటిదాకా ఎవరూ పూర్తి చేయలేదు. వైఎస్సార్‌ హయాలో కడప ఉక్కు పేరుతో కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్‌రెడ్డి బాగుపడ్డారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి అప్పట్లో గాలి జనార్ధన్‌రెడ్డి భారీ స్థాయిలో బహుమతులు ముట్టజెప్పారని ప్రచారం జరిగింది. అదే గాలి జనార్ధన్‌రెడ్డి, వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని తన సోదరుడిగా చెబుతుంటారు. ఆ వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ సీఎం హోదాలో మళ్ళీ కొత్తగా ఉక్కు పరిశ్రమకి శంకుస్థాపన చేశారు.. మూడేళ్ళలో పూర్తి చేస్తామనీ చెబుతున్నారు.

కానీ, కేంద్రం నుంచి నిధులు ఏమైనా వస్తాయా.? ఈ ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ప్రైవేటు సంస్థలేమైనా ముందుకొచ్చాయా.? అవేమీ జరగకపోతే, రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉక్కు పరిశ్రమను నిర్మించే ఆర్థిక శక్తి వుందా.? అన్న ప్రశ్నలకు మాత్రం అధికార పార్టీ నేతలు సమాధానం చెప్పడంలేదు. ‘మేం అధికారంలోకి వచ్చిన ఆర్నెళ్ళలోనే శంకుస్థాపన చేశాం.. ఇదీ మా చిత్తశుద్ధి..’ అంటూ వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రకటించేశారు.

శంకుస్థాపన కోసం వెచ్చించిన ఖర్చు దండగ తప్ప, ఉక్కు పరిశ్రమ వచ్చే అవకాశం లేదని కడప జిల్లా వాసులు నిట్టూరుస్తున్నారంటే, పరిస్థితి ఎంత దయనీయంగా వుందో అర్థం చేసుకోవచ్చు. విభజన చట్టంలో కడప ఉక్కు పరిశ్రమ అంశాన్ని ప్రస్తావించారు. ఆ చట్టం ప్రకారం రాష్ట్రానికి హక్కుగా ఉక్కు పరిశ్రమ దక్కాలి. కానీ, కేంద్రాన్ని ఈ విషయమై ప్రశ్నించే చిత్తశుద్ధి లేదు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి. సొంత జిల్లాలో ప్రజా వ్యతిరేకత రాకుండా వుండేందుకోసం శంకుస్థాపనని ఓ పబ్లిసిటీ ఈవెంట్‌గా మాత్రమే ఆయన చేపట్టారన్నది నిర్వివాదాంశమిక్కడ. కడప ఉక్కుకి ఈ రాజకీయ పబ్లిసిటీ తుప్పు ఎప్పుడు వదులుతుందో ఏమో.!

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...