Switch to English

ఎన్నికల సిత్రం: ప్రజాస్వామ్యంలోనూ వీళ్ళంతా ‘రాజు’లే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

జనాభా ప్రాతిపదికన ఆయా సామాజిక వర్గాలకు చట్ట సభల్లో సీట్లు దక్కడం సాధ్యమేనా.? అంటే, దళితులకు తప్ప, ఇంకెవరికీ అది సాధ్యం కాని వ్యవహారంలా మారింది. చట్ట సభల్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ తప్ప, బీసీలకు రిజర్వేషన్ లేదు. మహిళా కోటా విషయమై చాలాకాలంగా పోరాటాలు నడుస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో రెడ్డి, కమ్మ, వెలమ సామాజిక వర్గాలకు రాజకీయాల్లో అగ్ర తాంబూలం దక్కుతోందన్నది నిర్వివాదాంశం. కాపు సామాజిక వర్గాన్ని కేవలం ఓటు బ్యాంకుగా ప్రధాన రాజకీయ పార్టీలు చూస్తున్న వైనమూ కనిపిస్తోంది.

క్షత్రియ సామాజిక వర్గం విషయానికొస్తే, జనాభా శాతానికి మించి, కొందరు క్షత్రియ సామాజిక వర్గ నేతలు సీట్లు దక్కించుకుంటున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి, క్షత్రియ సామాజిక వర్గం నాయకులకు దక్కిన సీట్లు, ఆయా నేతలకు తమ తమ నియోజకవర్గాల్లో వున్న క్షత్రియ ఓటు బ్యాంకు వివరాల్ని ఒక్కసారి పరిశీలిస్తే, ఆసక్తికరమైన గణాంకాలు కనిపిస్తాయి.

విశాఖపట్నం నార్త్ నుంచి కన్నప్పరాజు వైసీపీ నుంచి బరిలో వున్నారు. ఈ నియోజకవర్గంలో క్షత్రియ ఓటు బ్యాంకు దాదాపు 20 వేలుగా వుంది. యలమంచిలో కన్నబాబురాజుకి నాలుగు వేల క్షత్రియ సామాజిక వర్గం ఓటు బ్యాంకు వుంది. ఇది మొత్తం ఓటు బ్యాంకు. ఒక సామాజిక వర్గమంతా ఒకే పార్టీకి ఓటేస్తుందని ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి.

ఆచంట నియోజకవర్గంలో చెరుకువాడ రంగనాత రాజు, నర్సాపురం నుంచి ముదునూరి ప్రసాదరాజు, ఉండి నరసింహరాజు తదితరులు క్షత్రియ సామాజిక వర్గం నుంచి బరిలో వున్నారు. వీరంతా వైసీపీ నాయకులే. కూటమి విషయానికొస్తే, విజయనగరం నుంచి పూసపాటి అదితి, విశాఖపట్నం నార్త్ నుంచి పెనుమత్స విష్ణువర్ధన్ రాజు, చోడవరం నుంచి కలిదిండి రాజు బరిలో వున్నారు.

అనపర్తి శివకృష్ణంరాజు, ముమ్మిడివరం దాట్ల సుబ్బరాజు (దాదాపు 12 వేల క్షత్రియ సామాజిక వర్గ ఓట్లున్నాయి ఇక్కడ), ఉండి మంతెన రామరాజు (దాదాపు పది వేల ఓట్లు), ఉంగుటూరు పత్సమట్ల ధర్మరాజు (దాదాపు 12 వేల ఓట్లు), బాపట్ల వేగేశ్న నరేంద్ వర్మ తదితరులు ఎన్నికల బరిలో వున్నారు.

మొత్తంగా అన్ని పార్టీల నుంచి 11 నియోజకవర్గాల్లో 13 మంది అభ్యర్థులు క్షత్రియ సామాజిక వర్గం నుంచి పోటీ చేస్తున్నారు.

కొన్ని నియోజకవర్గాల్లో క్షత్రియ సామాజిక వర్గం ఓట్లు చాలా తక్కువగా.. అంటే, 2,500 కంటే కూడా తక్కువే వున్నాయ్. అయినా, ఆయా నియోజకవర్గాల్లో క్షత్రియ సామాజిక వర్గానికి రాజకీయంగా పట్టుంది. ఆర్థికంగా బలంగా వున్న అభ్యర్థులనే కాదు, స్థానికంగా మంచి పేరు, పలుకుబడి కూడా కొందరు నేతలకు బాగా కలిసొస్తోంది.

ఒక్కో అభ్యర్థి ఎన్నికల అఫిడవిట్‌లో చూపించే మొత్తం కంటే దాదాపు పది రెట్లు వాస్తవ ఆస్తులు కలిగి వున్నట్లుగా ఆయా నియోజకవర్గాల్లోనే ప్రజలు చర్చించుకుంటుండడం గమనార్హం. ఈ లెక్కన వందల కోట్లు, వేల కోట్ల ఆస్తులున్న అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల నుంచి పోటీ పడుతున్నారన్నమాట.

రఘురామకృష్ణరాజు లాంటోళ్ళయితే, పది మంది వరకూ అభ్యర్థుల ఎన్నికల ఖర్చు సైతం భరించేలా రాజకీయాలు చేయగలిగే సత్తా వున్నోళ్ళే.

అందుకే, ప్రజాస్వామ్యంలోనూ రాజులున్నారన్న అభిప్రాయాలు తరచూ తెరపైకి వస్తుంటాయి. తమ స్టామినాకి ఇంకా రాజకీయాల్లో మెరుగైన గౌరవం దక్కాల్సి వుందని క్షత్రియ సామాజిక వర్గ నేతలు తరచూ వాదిస్తుంటారనుకోండి.. అది వేరే సంగతి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

రాజకీయం

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎక్కువ చదివినవి

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను : చిరంజీవి

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత కొంత సమయం సరదాగా...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

బర్త్ డే స్పెషల్ : రౌడీ స్టార్‌ టు ఫ్యామిలీ స్టార్‌

2012 లో వచ్చిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ 2015 లో మొదటి సారి మెయిన్ లీడ్‌ రోల్‌ ను ఎవడే సుబ్రహ్మణ్యంలో చేశాడు. ఆ...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...