Switch to English

తమ్ముడు పవన్ కళ్యాణ్ వెంటే అన్నయ్య చిరంజీవి.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,430FansLike
57,764FollowersFollow

జనసేన పార్టీకి ఐదు కోట్ల రూపాయల విరాళాన్ని అందించారు మెగాస్టార్ చిరంజీవి.! ఐదు కోట్లు.. అంటే, కేవలం రూపాయలు కాదు.! ఆశీస్సులు.! ఔను, జనసేన పార్టీకి మెగాస్టార్ చిరంజీవి అందించిన ఆశీస్సులు అవి.

‘నేను రెండు పడవల మీద ప్రయాణం చెయ్యలేకపోయాను. కానీ, నా తమ్ముడు అలా కాదు.. రెండు పడవల మీద ప్రయాణం సమర్థవంతంగా చేయగలడు..’ అంటూ, సినిమాల్నీ అలాగే రాజకీయాల్ని బ్యాలన్స్ చేయగలడని తన తమ్ముడు పవన్ కళ్యాణ్ గురించి గతంలో చిరంజీవి వ్యాఖ్యానించారు.

‘ప్రజారాజ్యం పార్టీ కోసం పవన్ కళ్యాణ్ పని చేశారుగానీ, జనసేన పార్టీ కోసం చిరంజీవి పని చేయడంలేదు..’ అంటూ అన్నదమ్ముల మధ్య గొడవలు పెట్టేందుకు చాలామంది ప్రయత్నించారు. చిరంజీవి చేయలేక కాదు, అన్నయ్యతో చేయించలేకా కాదు.. పవన్ కళ్యాణ్, ‘ప్రజారాజ్యం పార్టీ’ తాలూకు అనుభవాల నేపథ్యంలో అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించారు.

తమ్ముడి రాజకీయ వ్యూహాల్ని అన్నయ్య చిరంజీవి గౌరవిస్తూ వచ్చారు. చిరంజీవి మాత్రమే కాదు, రామ్ చరణ్ కావొచ్చు, అల్లు అరవింద్ కావొచ్చు.. ఇలా మెగా కాంపౌండ్‌కి చెందిన ప్రతి ఒక్కరూ, జనసేన విషయంలో వ్యూహాత్మక మౌనం వహిస్తూ వచ్చారు.

తీవ్ర జ్వరంతో బాధపడుతూ కూడా, ఎన్నికల ప్రచాంలో జనసేనాని బిజీగా వుండడం పట్ల, మెగా కాంపౌండ్ ఆందోళన చెందుతోంది. అవసరమైన నైతిక మద్దతు అందిస్తూనే వుంది. ఒక్క పిలుపు పవన్ కళ్యాణ్ నుంచి వస్తే, మెగా కాంపౌండ్ మొత్తం జనసేన తరఫున ఎన్నికల ప్రచారంలోనే వుంటుంది. దీనికి నిదర్శనం, చిరంజీవి ప్రకటించిన ఐదు కోట్ల విరాళం.

అధికారంలోకి వచ్చాక సాయం చేస్తామనేవారుంటారు.. కానీ, ఏ పదవీ లేకుండానే కౌలు రైతుల కుటుంబాల్ని ఆదకుంటున్నాడు నా తమ్ముడు.. అందుకే, ఆ గొప్ప కార్యక్రమంలో నా వంతు సాయం.. అంటూ చిరంజీవి ఐదు కోట్ల రూపాయల విరాళాన్ని జనసేనకు అందించడం గమనార్హం.

మెగాస్టార్ చిరంజీవి అంటేనే టైమింగ్.! అది సినిమా అయినా, రాజకీయాలైనా.. ఆయన టైమింగే వేరు.! పేర్ని నాని లాంటి కొందరు వైసీపీ నేతలు, చిరంజీవి – పవన్ కళ్యాణ్ మధ్య చిచ్చు పెట్టాలని చాలా ప్రయత్నాలు చేసి బొక్కబోర్లా పడ్డారు. అలాంటి వాళ్ళందరికీ, ఇప్పుడు చిరంజీవి – పవన్ కళ్యాణ్ కలయిక చెప్పు దెబ్బ లాంటిదే.!

‘చిరంజీవి ఇచ్చింది కేవలం విరాళం కాదు.. ఇదొక స్టేట్‌మెంట్.. తమ్ముడు పవన్ కళ్యాణ్ వెంట అన్నయ్య చిరంజీవి వున్నాడన్నదే ఆ స్టేట్మెంట్..’ అని మెగాభిమానులు ముక్త కంఠంతో నినదిస్తున్నారు.

ఇదిగో, ఈ మహత్తర ఘట్టం తెరపైకొస్తుందని తెలిసే, జనసేన నుంచి పోతిన మహేష్‌ని వైసీపీ తన వైపుకు తిప్పుకుంది. పవన్ కళ్యాణ్ అభిమానులనండీ, జనసైనికులనండీ.. పవన్ కళ్యాణ్ వెంట నడిచే నాయకుల్ని రాత్రికి రాత్రి పొలిటికల్ స్టార్లను చేయగలరు.. అదే సమయంలో, ఆ నాయకుల్ని రాత్రికి రాత్రి జీరోలుగానూ మార్చెయ్యగలరు.

మెగా డొనేషన్‌ని డైల్యూట్ చేయడానికి పావులా మారిన పోతిన మహేష్‌ని ఆల్రెడీ జనసైనికులు మర్చిపోయారు.! వైసీపీ వ్యూహం బెడిసి కొట్టింది. జనసేన పార్టీకి మెగాస్టార్ చిరంజీవి విరాళం.. అన్న ప్రకటన, జనసైనికుల్లో వెయ్యేనుగుల బలాన్ని నింపింది. మీడియా మొత్తం ఇదే అంశం చుట్టూ ఫోకస్ చేయడంతో, వైసీపీ ఆడిన పోతిన మహేష్ డ్రామా.. అట్టర్ ఫ్లాప్ అయ్యింది.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

‘భజే వాయువేగం’ నుంచి ‘సెట్ అయ్యిందే’ సాంగ్ విడుదల

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ( Karthikeya ) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'భజే వాయువేగం'. ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను మూవీ టీం రిలీజ్ చేసింది. 'సెట్ అయ్యిందే'...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...