Switch to English

Bollywood: గాడిన పడ్డ బాలీవుడ్.. హిందీ పరిశ్రమ కి మంచి రోజులు వచ్చాయి

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

Bollywood: ఒకప్పుడు బాలీవుడ్ సినిమా అంటే ఓ రేంజ్. ఒక బ్రాండ్. భారీ బడ్జెట్, గ్రాండ్ పాటలు ఆ ఇండస్ట్రీ సొంతం. కరోనా తర్వాత సీన్ రివర్స్ అయ్యింది. కోవిడ్ తర్వాత విడుదలైన బాలీవుడ్ భారీ బడ్జెట్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. కొంతకాలం పాటు సరైన హిట్లు లేక బాలీవుడ్ చతికిలపడింది. దాదాపు మూడేళ్లపాటు తన రేంజ్ కి తగ్గ హిట్ కోసం వెయిట్ చేసిన బాలీవుడ్ కి 2023 సంవత్సరం శుభారంభం పలికింది. భారీ బడ్జెట్ సినిమాలు కొన్ని హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో ఆ ఇండస్ట్రీకి పునర్వైభవం వచ్చి పడుతోంది. ఆ లిస్టులో ఉన్న సినిమాలు ఏంటో చూద్దాం.

పఠాన్

ఏడాది ఆరంభంలోనే బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్( Shah Rukh Khan).. ‘పఠాన్’ సినిమాతో బోణి కొట్టారు. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25న ఈ సినిమా విడుదలైంది. కాస్ట్యూమ్స్ విషయంలో విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంది. అయినప్పటికీ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.1000 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దీపిక పదుకొనే( Deepika Padukone)హీరోయిన్ గా నటించింది.

గదర్

2001 లో విడుదలైన ప్రేమ కథా చిత్రం ‘గదర్(Gadar)’ ఎంత హిట్ అయిందో తెలిసిందే. సన్నీడియోల్-అమీషా పటేల్( Ameesha Patel) జంటగా కేవలం రూ.18 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.133 కోట్లు కొల్లగొట్టింది. సరిగ్గా 22 ఏళ్ల తర్వాత ఈ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన ‘గదర్-2( Gadar-2)’ ఆగస్టు 11న విడుదలైంది. తొలిరోజే ఈ సినిమా రూ.40 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది. 20 ఏళ్ల క్రితం స్క్రీన్ పై మ్యాజిక్ ని ఆవిష్కరించిన సన్నీడియోల్- అమీషా జంట ఈ సినిమాలోను మెప్పించారు. విడుదలైన నాలుగు రోజుల్లో రూ.180 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. మొదటి భాగాన్ని తెరకెక్కించిన అనిల్ శర్మ ఈ సినిమాకి కూడా దర్శకుడు.

ఓ మై గాడ్ -2

పదేళ్ల క్రితం వచ్చిన ‘ఓ మై గాడ్’ సినిమాకి కొనసాగింపుగా ‘ఓ మై గాడ్-2( Oh My God-2)’ తెరకెక్కింది. అక్షయ్ కుమార్( Akshay Kumar), పంకజ్ త్రిపాఠి,యామి గౌతమ్( Yami Goutham) ప్రధాన పాత్రల్లో ఈ సినిమా రూపొందింది. ఆగస్టు 11న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సినిమాలో శివుడి గా అక్షయ్ కుమార్, లాయర్ గా యామి గౌతమ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఈ సినిమా విడుదలైన తొలి వారంలోనే రూ. 60 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. హిట్ టాక్ తెచ్చుకోవడంతో మరిన్ని వసూలు పెరిగే అవకాశం ఉంది.

‘పఠాన్’ తర్వాత విడుదలైన కొన్ని భారీ బడ్జెట్ సినిమాలు చేతులెత్తేసినప్పటికీ ఈ రెండు సినిమాలు హిట్ టాక్ తెచ్చుకోవడం బాలీవుడ్ కి కాస్త ఉపశమనం కలిగించే విషయం.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

Elephant: గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ భద్రత.. వీడియో వైరల్

Elephant: కుటుంబం తమ పిల్లల సంరక్షణను ఎలా చూసుకుంటుందో మానవ సంబంధాలలో చూస్తూంటాం. తమకూ తెలుసనిపించేలా ఉన్న అడవిలోని ఏనుగులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ‘ఎక్స్’లో...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....