Switch to English

అమూల్ సంస్థకు ఏపీలో బ్రాండ్ అంబాసిడర్ గా సీఎం జగన్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

గుజరాత్ కు చెందిన పాల ఉత్పత్తుల సంస్థ అయిన అమూల్ కు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏపీలో బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. వేల కోట్ల ఆస్తులను స్థానికంగా ఉండే డెయిరీలకు కాదని ఉత్తరాది సంస్థ కు కట్టబెడుతున్నారు. రాష్ట్రంలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన విజయ డైరీ పునరుద్ధరణ పేరుతో సుమారు రూ.650 కోట్ల ప్రజాధనాన్ని కారుచౌకగా కేవలం ఏడాదికి రూ. కోటి లీజుకు 99 ఏళ్ల పాటు అమూల్ కు అప్పగించారు. నిన్నమొన్నటి వరకు హెరిటే, సంగం డైరీలపై విషం చల్లిన వైసీసీ నాయకులు అమూల్ విషయంలో మాత్రం ఎక్కడ లేని ప్రేమను చూపిస్తున్నారు. ఇప్పటికే చిత్తూరులో శివశక్తి డైరీ పేరుతో స్థానిక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాడి రైతులను దోపిడీ చేస్తుంటే… అమూల్ పేరుతో సీఎం జగన్ పెద్ద కుట్రకు తెరతీశారు. పొరుగు రాష్ట్రాలు అయిన తమిళనాడు, కర్ణాటకలు అమూలు మోసాలను గ్రహించి దూరం పెడితే.. కమీషన్ల కోసం, తన మీద ఉన్న కేసుల మాఫీ కోసం ఆంధ్ర పాడిరైతుల భవిష్యత్తును గుజరాత్ కార్పొరేట్ కాళ్ల కింద పెట్టారు.

రాష్ట్రంలోని డైరీలు లాభాల నుంచి బోనస్ తో పాటు పశువులకు వైద్యసేవలు, తక్కువ ధరకు దాణా, మేలు జాతీ పశువుల వీర్యాన్ని పాడిరైతులకు తక్కువ ధరకు విక్రయిస్తున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పాడి పరిశ్రమకు ఊతాన్ని ఇస్తున్నాయి. అలాంటి కో- ఆపరేటివ్, ప్రైవేటు డైరీలకు జగన్ సర్కార్ ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదు. కానీ అమూల్ డైరీకి మాత్రం అప్పనంగా ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ రూ. 6 వేల కోట్లను కట్టబెట్టింది. చిత్తూరు పునరుద్ధరణ ముసుగుతో ప్రజధనాన్ని అమూల్ కు దోచిపెడుతూ.. అందులోని కమీషన్లు సరాసరి తాడేపల్లి ప్యాలెస్ కు చేరేలా పథక రచన చేస్తున్నారు ప్రభుత్వ పెద్దలు. చిత్తూరు కలెక్టరేట్ సమీపంలో ఉన్న సుమారు 33 ఎకరాల విజయ డైరీ భూమిని ఈ ప్రక్రియలో భాగంగా కాజేశారు. జపాన్, జర్మనీల నుంచి సుమారు రూ. 30 కోట్ల విలువైన డైరీ సామాగ్రిని తెప్పించారు. వీటిని కూడా అమూల్ పరం చేసింది జగన్ రెడ్డి ప్రభుత్వం. ఎప్పటి నుంచో పాడి రైతులకు అండగా నిలుస్తున్న ఇతర డైరీలను నిర్వీర్యం చేసే దిశగా జగన్ రెడ్డి ఈ గుజరాత్ కంపెనీకు దోచిపెడుతున్నారు.

అన్నీ తామై అమూల్ కు అండగా…

ఏపీలోని అంగన్వాడీ కేంద్రాలకు కర్ణాటక మిల్క్‌ ఫెడరేషన్ కు సంబంధించిన నందిని అనే పాల ఉత్పత్తి సంస్థ రవాణా ఖర్చులతో కలిపి లీటరు రూ.57.25 చొప్పున పాలను సరఫరా చేస్తుండగా.. అమూల్ కు మాత్రం రవాణా ఖర్చులను తామే చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొనడం వైసీపీ, అమూల్ సంస్థకు మధ్య ఉన్న లాలూచీ ఒప్పందాలు అర్థం అవుతున్నాయి. ఈ పాల సరఫరా ఒప్పందం ప్రకారం అముూల్ పై పన్ను భారం పడకుండా తామే చెల్లిస్తామంటూ ప్రభుత్వం పేర్కొంది. పాలపై విధించే 5% జీఎస్టీ కూడా ప్రభుత్వమే భరించనుంది. ఇలా రవాణా ఖర్చులు, పన్నుల రూపేణా ప్రభుత్వానికి ఏడాదికి రూ.12 కోట్ల భార పడనుంది. ఇలా అమూల్ కు జగన్ రెడ్డి రూపాయికి రూపాయి దోచి పెడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....