ఏడాదిలోనో, రెండేళ్ళలోనో ఎన్నికలకు వెళతామంటూ వైసీపీ ముఖ్య నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు వైసీపీ వర్గాలే షాక్ అయ్యేలా చేశాయి. వాస్తవానికి, 2024లో ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు.. అంటే, లోక్ సభ అలాగే అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి వుంది.
అయితే, ముందస్తు వ్యూహమే మంచిదంటూ తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేసిన సూచన మేరకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆ దిశగా కసరత్తులు చేస్తున్నట్లుగా చాన్నాళ్ళుగా ఏపీలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
2014 ఎన్నికల్లో గెలిచి తెలంగాణలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ అధినేత కేసీయార్, 2019 వరకూ వేచి చూడకుండా, 2018 చివర్లో ముందస్తు ఎన్నికలకు వెళ్ళిన సంగతి తెలిసిందే. దాంతో, తిరిగి అధికారం గులాబీ పార్టీకి తేలిగ్గానే దక్కింది. అయితే, పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం గులాబీ పార్టీ నష్టపోయిందనుకోండి.. అది వేరే సంగతి.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది చివర్లో జరగాలి. అయితే, అది వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలోనే జరగొచ్చన్న ప్రచారమూ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే, ఏపీలో కూడా ముందస్తు ఎన్నికలకు రంగం సిద్ధమవుతోందని స్వయానా అధికార వైసీపీకి చెందిన ముఖ్య నేత చేసిన ప్రకటనను బట్టి అర్థం చేసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ అప్పుల కుప్పగా మారిపోయింది. ప్రతి నెలా కొత్త అప్పు చేయకపోతే, రాష్ట్రం మనుగడ సాధించడమే కష్టంగా మారిపోతోంది. ఈ నేపథ్యంలోనే, ముందస్తు ఎన్నికలు తప్ప మరో అవకాశం లేకుండా పోయింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి. అప్పు దొరక్కపోతే సంక్షేమ పథకాలు ఆగిపోతాయి. ఆ సంక్షేమ పథకాలు ఆగిపోతే ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. ఆ పరిస్థితి రాకూడదంటే ముందస్తు ఎన్నికలొక్కటే శరణ్యమన్నమాట.
2023 వరకూ ఆగుతారా.? లేదంటే, 2022 చివర్లోనే వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేతులెత్తేసి ముందస్తు ఎన్నికలకు వెళతారా.? వేచి చూడాల్సిందే.
2237 8653You completed numerous nice points there. I did a search on the issue and located practically all individuals will have the same opinion together with your blog. 342741
391814 466429Wow Da weiss man, wo es hingehen muss Viele Grsse Mirta 917461
330649 19371It is onerous to search out knowledgeable individuals on this subject, nevertheless you sound like you already know what you are talking about! Thanks 754202