Switch to English

చంద్రబాబు ‘మాస్’ ర్యాగింగ్: వైసీపీ వద్ద సమాధానమేదీ.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

వామ్మో, చంద్రబాబులో వున్నపళంగా ఇంత ఎనర్జీ ఎలా వచ్చేసింది.? వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయమై చంద్రబాబు వేసిన తాజా ఛలోక్తులు చూసి వైసీపీ శ్రేణులే విస్తుపోతున్నాయి. ‘చచ్చినపాము’లా చంద్రబాబుని వైసీపీ భావిస్తూ వచ్చింది ఇప్పటిదాకా. అంత దారుణమైన రీతిలో వైసీపీ, 2019 ఎన్నికల్లో టీడీపీని చావు దెబ్బ కొట్టింది.

సరే, రాజకీయాల్లో గెలుపోటములు సహజం. నిన్న టీడీపీకి తగిలితే, అంతకు మించిన దెబ్బ రేపు వైసీపీకి తగలొచ్చు. అది వేరే సంగతి. ఏపీ రాజధాని అమరావతికి సంబంధించి న్యాయస్థానం ఇచ్చిన తీర్పు, టీడీపీలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. మరీ ముఖ్యంగా చంద్రబాబుకి కొండంత బలాన్నిచ్చింది. ఎందుకంటే, చంద్రబాబే కదా, అమరావతిని రాజధానిగా తన హయాంలో ప్రకటించింది. చంద్రబాబే కదా, సీఆర్డీయేని తెరపైకి తెచ్చి.. రైతులకీ, ప్రభుత్వానికీ మధ్య ఒప్పందాలు కుదిరేలా చేసింది.

ఆ ఒప్పందాల ప్రకారమే రైతులకు న్యాయం చేయాలని కోర్టు తీర్పునివ్వడంతో చంద్రబాబులో కొత్త ఉత్సాహం కనిపించింది. ఈ జోరులోనే, వైఎస్ వివేకానందరెడ్డి హత్య సహా పలు అంశాలపై చంద్రబాబు తనదైన సెటైర్లతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విరుచుకుపడ్డారు.

‘నారాసుర రక్త చరిత్ర అన్నారు.. ఇప్పుడేమో జగనాసుర రక్త చరిత్ర అని తేలుతోంది.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య ద్వారా వైఎస్ జగన్ రెండు రకాలుగా మేలు పొందారు. తనకు అడ్డంకిగా మారిన వివేకాను వైఎస్ జగన్ తొలగించుకున్నారు. అదే సమయంలో, ఆ సింపతీని అడ్డంపెట్టుకుని, టీడీపీ మీద బురదచల్లి, ప్రజల్ని వంచించి, మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు..’ అని చంద్రబాబు విమర్శించారు.

అంతేనా, ‘టీడీపీ మనిషిగా వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతా రెడ్డి గురించి దుష్ప్రచారం చేస్తున్నారు. సునీతా రెడ్డి టీడీపీ మనిషి అయితే, అవినాష్ రెడ్డి కూడా టీడీపీ మనిషే. వైఎస్ షర్మిల కూడా టీడీపీ మనిషే. వైఎస్ విజయమ్మ, భారతి.. అంతెందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా టీడీపీ మనిషే..’ అంటూ చంద్రబాబు సెటైర్లేసేశారు.

ఇది ఆషామాషీ ర్యాగింగ్ కాదు. దీనికి సమాధానం చెప్పడం వైసీపీ నేతలెవరివల్లా కావడంలేదు. ఏమని సమాధానం చెప్పగలరు.? ఏమో, రేప్పొద్దున్న షర్మిల కూడా టీడీపీ మనిషేనని వైసీపీ ఆరోపించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. సునీతారెడ్డి, షర్మిల.. విజయమ్మ, భారతి.. ఎవరి మీదనైనా తమ రాజకీయ అవసరాలకు తగ్గట్టుగా ఆరోపణలు చేయడం వైసీపీకే చెల్లుతుంది మరి.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...