రెండేళ్ల తరువాత తిరుమలలో సామాన్య భక్తులకు సర్వదర్సనం ప్రారంభించడం సంతోషంగా ఉందని టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అన్నారు. తిరుమలలో అన్నప్రసాద కౌంటర్లు పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘సర్వదర్శనం ప్రారంభించి పది రోజులు పూర్తవుతూండటంతో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. ఎంతమంది భక్తులు వచ్చినా అన్నప్రసాదం వద్ద ఎలాంటి ఇబ్బందులు రానివ్వడం లేదు. ఉత్తరాది భక్తుల కోసం త్వరలోనే భోజనంతో పాటు మూడుపూటలా రొట్టెలు, చపాతీలను అందిస్తాం. రద్దీ తగ్గించేందుకు మరో రెండు ప్రాంతాల్లో అన్నప్రసాదాన్ని అందించే ఏర్పాట్లు చేస్తున్నాం’.
‘ఆర్జిత సేవలను పునఃప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నాం. ఏప్రిల్ నుంచి అన్ని సేవలను ప్రారంభించేందుకు ప్రయత్నం చేస్తున్నాం. శ్రీవారి ఆర్జిత సేవల ధరలను పెంచే ఆలోచన టిటిడికి లేదు. పాలకమండలిలో ధరల పెంపుపై కేవలం చర్చ మాత్రమే జరిగింది. సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించడమే టిటిడి పాలకమండలి ముఖ్య ఉద్దేశం. విఐపి దర్సనాలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం’ అని తెలిపారు.
692522 486983TeenVogue? Looking for fashion advice, celebrity buzz or beauty trends? Discover it all in Teen Vogue 149369
443039 548089If your real buddies know you as your nickname, use that nickname as your 1st name online. When you 1st friend someone, focus on creating a private comment that weaves connection. 412753