పోర్షే, బెంట్లీ, ఆడీ, లాంబోర్గిని వంటి విలాసవంతమైన 3965 కార్లను తీసుకొస్తున్న ‘ఫెసిలిటీ ఏస్’ అనే భారీ నౌకలో మంటలు చెలరేగాయి. అట్లాంటిక్ మహాసముద్రం మధ్యలో అజోర్స్ ద్వీపాలకు కొద్ది దూరంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం విషయం తెలుసుకున్న పోర్చుగీసు నేవీ, ఎయిర్ ఫోర్స్ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్చలు చేపట్టారు. నౌకలోని సిబ్బందిని సురక్షితంగా ఓ హోటల్ కు తరలించారు.
జర్మనీలోని వోల్ఫ్స్ బర్గ్ లో ఫోక్స్ వ్యాగన్ గ్రూపునకు చెందిన ఓ తయారీ కేంద్రంలో ఈ కార్లు తయారవుతున్నాయి. స్థానికంగానే ఉన్న ఎండెన్ పోర్టు నుంచి వీటిని అమెరికాలోని డావిస్ విల్లే పోర్టుకు తరలిస్తూండగా ఈ ప్రమాదం జరిగింది. నౌకలో 1100 పోర్షే కార్లు ఉన్నట్టు కంపెనీ అధికార ప్రతినిధి ల్యూక్ అంటున్నారు. ప్రమాద విషయాన్ని కార్లు అందుకునే యజమాన్యాలకు డీలర్ల ద్వారా విషయం చేరవేసినట్టు తెలిపారు. ఈ షిప్ పరిమాణం దాదాపు మూడు ఫుట్ బాల్ గ్రౌండ్స్ అంత ఉంటుంది. 2019లో ఆడీ, పోర్షే కార్లున్న గ్రాండే అమెరికా అనే భారీ నౌక మునిగిపోయింది.
657375 23681great post. Neer knew this, regards for letting me know. 921382
Hello mates, good piece of writing and nice urging commented at this place, I am really enjoying by these.
It’s fantastic that you are getting thoughts from this article as well as from our
dialogue made at this time.