నిజాయతీ అంటే అర్థం ఏమిటో ఆ దంపతులు నిరూపించారు. రూ.6 కోట్లను అప్పగించి శెభాష్ అనిపించుకున్నారు. ఎర్నాకుళంలోని వలంబుర్ కక్కనాడ్ కు చెందిన స్పిజా కె మోహన్, రాజేశ్వరన్ దంపతులు లాటరీ టికెట్లు విక్రయిస్తుంటారు. రోజూలాగానే గత ఆదివారం రాజగిరి ఆస్పత్రి సమీపంలో లాటరీ టికెట్లు అమ్ముతున్నారు. అన్నీ అముమడై 12 టికెట్లు మాత్రం మిగిలాయి. వాటిని కూడా అమ్మి ఇంటికి వెళ్లిపోదామని చూశారు. కానీ ఎవరూ రాలేదు. ఈ నేపథ్యంలో తరచుగా తమ దగ్గర టికెట్లు కొనేవారిని అడిగి చూద్దామని భావించారు. అనంతరం పాలచోటిల్ కు చెందిన పేకే చంద్రన్ కు ఫోన్ చేసి టికెట్ కొనమని అడిగారు. అయితే, టికెట్ కొనడానికి అవసరమైన రూ.200 ఇప్పుడు లేవని.. మర్నాడ ఇస్తానని ఆయన చెప్పారు.
అందుకు స్పిజా దంపతులు సరే అని ఫోన్ లోనే టికెట్ నెంబర్ చెప్పారు. మరుసటి రోజు డ్రా తీయగా.. చంద్రన్ కొనుగోలు చేసిన టికెట్ కే లాటరీ వచ్చింది. వాస్తవానికి టికెట్ ఎవరి దగ్గర ఉంటే వారికే డబ్బులిస్తారు. చంద్రన్ టికెట్ స్పిజా దంపతుల దగ్గరే ఉన్నా.. ఆ నెంబర్ కే లాటరీ వచ్చిందని తెలిసినా వారు అత్యాశకు పోకుండా తమ నిజాయతీ నిరూపించుకున్నారు. చంద్రన్ ఇంటికి వెళ్లి ఆ టికెట్ కే లాటరీ వచ్చిందని చెప్పి టికెట్ ఇచ్చి రూ.200 తీసుకుని వెళ్లారు. దీంతో స్పిజా దంపతుల నిజాయతీకి స్థానికులు బ్రహ్మరథం పడుతున్నారు.
722300 95861Echt tolle Seite. Rubbish bin eigentlich nur per Zufall hier gelandet, aber ich bin jetzt schon complete von der tremendous Seite beeindruckt. Gratuliere dazu!! Viel Erfolg noch durch der sehr guten Home-page mein Freund. 513696
717609 285800Hi there, I found your weblog via Google even though looking for 1st aid for a heart attack and your post looks quite fascinating for me. 982597
17465 959192Couldn?t be designed any greater. Reading this post reminds me of my old room mate! He always kept talking about this. I will forward this report to him. Pretty certain he will possess a great read. Thanks for sharing! 105260