రాష్ట్రంలో పూర్తి స్థాయిలో తరగతులు నిర్వహిస్తున్నామని.. ప్రణాళికతో చర్యలు తీసుకోవడంతో అకడమిక్ క్యాలెండర్ గాడిలో పెట్టగలిగామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. రాష్ట్రంలో కోవిడ్ స్థితిగతులపై మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కొవిడ్ కేసులు వచ్చిన విద్యాసంస్థలు వెంటనే మూసేయాలి. పెద్దఎత్తున సంక్షోభం వస్తే కొంత నష్టం తప్పక ఉంటుంది. దేశంలోనే అత్యధిక కరోనా టెస్టులు మన రాష్ట్రంలోనే చేశాం.’
‘కోవిడ్ మళ్లీ పుంజుకుంటున్న ప్రస్తుత దశలో రెండు నెలలు జాగ్రత అవసరం. రాజమండ్రిలోని ప్రైవేట్ కళాశాలలో 168 మందికి కరోనా సోకింది. కరోనా సోకిన వారిని ప్రాథమికంగా గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలి. పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తప్పవు. ఆదివారాలు కూడా ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తాం. విద్యార్థులకు కరోనా పరీక్షలు ఇంకా పెంచుతాం’ అని అన్నారు. మరోవైపు రాష్ట్రంలో రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యికి చేరువవుతోంది.
143107 680484Hey extremely good weblog!! Man .. Beautiful .. Amazing .. I will bookmark your internet site and take the feeds alsoIm satisfied to seek out numerous beneficial info here in the post, we want develop a lot more techniques on this regard, thanks for sharing. 533591
6417 847841Outstanding post, I conceive people really should larn a whole lot from this weblog its really user friendly . 326563