మహాభారతంలో ద్రౌపది గురించి తెలుసు కదా? పాండవులు ఐదుగురినీ వివాహమాడిన వనితగా ఆమె అందరికీ సుపరిచితమే. ఇలాంటి మహిళ మన నిజ జీవితంలోనూ ఉందండోయ్. ఐదుగురు భర్తలతో ఒకే ఇంట్లో ఉంటూ అభినవ ద్రౌపదిగా పేరు తెచ్చుకుంది. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ సమీపంలోని ఓ గ్రామానికి చెందిన రాజో అనే మహిళకి ఐదుగురు భర్తలు. వారంతా అన్నదమ్ములే కావడం మరో విశేషం. ఈ గ్రామంలో బహు భర్తత్వానికి అనుమతి ఉంది. పురాతన సంప్రదాయమైన ఈ విధానం ఇక్కడ ఇంకా కొనసాగుతోంది. అంటే ఓ మహిళ ఒకరి కంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకోవచ్చు.
పేదరికాన్ని నిర్మూలించడానికి, కుటుంబ ఆస్తి ముక్కలు కాకుండా ఉండటానికి, జనాభా పెరుగుదలను నియంత్రించడానికి ఈ పద్ధతిని అమలు చేసేవారు. రాజో తొలుత గుడ్డు వెర్మ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అనంతరం గుడ్డు తమ్ముళ్లు బజ్జు వెర్మ, సంత్ రామ్, గోపాల్ వెర్మ, దినేశ్ వెర్మలను కూడా వివాహం చేసుకుంది. అప్పటినుంచి అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. ముందుగా చేసుకున్న అంగీకారం ప్రకారం ఆమె.. రోజుకు ఒకరితో నిద్రిస్తుంది. ప్రస్తుతం రాజోకి రెండున్నర సంవత్సరాల బాబు కూడా ఉన్నాడు. అయితే, ఆ బాబుకి నిజమైన తండ్రి ఎవరో ఎవరికీ తెలియదు.
తన భార్యను తమ్ముళ్లతో కలిసి పంచుకోవడం పట్ల తనకు ఎలాంటి అభ్యంతరం లేదని గుడ్డు స్పష్టంచేస్తున్నాడు. తామంతా కలిసి ఆనందంగా ఉంటున్నామని పేర్కొన్నాడు. ఆ నలుగురినీ పెళ్లి చేసుకోవడానికి తొలుత కాస్త భయపడ్డానని, అయితే, తన తల్లి కూడా ముగ్గురు అన్నదమ్ములనే వివాహం చేసుకుందని, అందువల్ల ఇక మరో ఆలోచన లేకుండా వారిని పెళ్లాడానని రాజో తెలిపింది. ఒకరిపై తక్కువ ప్రేమ, మరొకరిపై ఎక్కువ ప్రేమ ఉండదని, తనకు అందరూ సమానమేనని చెప్పింది. తన ఐదుగురు భర్తలూ కూడా తనను ఎంతో ప్రేమగా చూసుకుంటారని, ఇంతకు మించి ఏ మహిళకైనా ఏమి కావాలని ప్రశ్నించింది. మొత్తమ్మీద పురాణాల్లోనే చూసిన ద్రౌపది రాజో రూపంలో మన కళ్ల ముందుకు వచ్చిందన్నమాట.
226774 321756Just added this blog to my favorites. I enjoy reading your blogs and hope you maintain them coming! 237565