ఓవైపు వైద్యురాలిపై అత్యాచారానికి పాల్పడిన నలుగురు నిందితుల ఎన్ కౌంటర్.. మరోవైపు నిర్భయ దోషులను ఉరి తీయడానికి సన్నాహాలు.. అయినప్పటికీ మృగాళ్ల తీరు మారడంలేదు. ఏపీ అసెంబ్ల దిశ బిల్లుకు ఆమోదం తెలిపినే రోజే మూడు అత్యాచార ఘటనలు వెలుగుచూశాయి. గుంటూరు, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో ఆయా సంఘటనలు చోటుచేసుకున్నాయి.
గుంటూరు జిల్లాలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థి పక్క ఇంట్లో ఉండే ఐదేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ బాలికపై ఘాతుకానికి తెగబడ్డాడు. ఈ విషయం ఎవరికైన చెబితే చంపేస్తానని చెప్పాడు. కానీ ఆ చిన్నారి జరిగిన సంగతంతా తన తల్లికి చెప్పడంతో నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నిందితుడు లక్ష్మారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఇక ప్రకాశం జిల్లాలో మూగ యువతిపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. పక్క ఇంట్లో ఉండే కరుణాకర్ రెడ్డి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అనంతపురం జిల్లా కదిరిలో ఓ బాలికపై సెక్యూరిటీ గార్డు అత్యాచారయత్నం చేయబోయాడు. ఆ బాలిక తన తల్లికి విషయం చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయా ఘటనలపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
దిశ చట్టానికి ఆమోదం పొందినరోజే ఇలాంటి సంఘటనలు జరగడంతో నిందితులను వెంటనే ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. దిశ చట్టం ఆమోదం పొందిన రోజే ఇలాంటి ఘటనలు జరగడం దారుణమని, కొత్త చట్టం ప్రకారం నిందితులను సీఎం జగన్ శిక్షిస్తారని తాను ఆశిస్తున్నట్టు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. మరి దిశ చట్టం ప్రకారం ఈ కేసుల్లో 21 రోజుల్లో న్యాయం చేయడలో జగన్ సర్కారు విజయం సాధిస్తుందా లేదా అనేది త్వరలోనే తేలనుంది.
783795 885781Respect to site author , some amazing entropy. 213041
205682 355754Glad to be 1 of a lot of visitors on this awing internet site : D. 976708
642145 768704For anybody who is interested in enviromentally friendly things, may well possibly surprise for you the crooks to maintain in mind that and earn under a holder basically because kind dissolved acquire various liters to essential oil to make. daily deal livingsocial discount baltimore washington 416616