రోజులు గడుస్తున్నాయ్.. వారాలు గడుస్తున్నాయ్.. నెలలు, సంవత్సరాలు కూడా గడిచిపోతున్నాయ్.. మూడు రాజధానుల వ్యవహారం కాస్తయినా ముందుకు కదలడంలేదు. ఇంకోపక్క మూడు రాజధానులు వద్దు.. ఏకైక రాజధాని అమరావతి ముద్దు.. అంటూ 500 రోజులుగా ఆందోళనలు కొనసాగుతూనే వున్నాయి. మే నెలలో.. అంటే ఈ నెలలోనే ఎట్టిపరిస్థితుల్లోనూ విశాఖ నుంచి పరిపాలన చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భావించారంటూ అధికార పార్టీ నుంచి లీకులు అందాయి.
‘మే నాటికి అన్ని సమస్యలూ తొలగిపోతాయ్..‘ అంటూ సాక్షాత్తూ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు గతంలో చెప్పిన విషయం విదితమే. మే నెల వచ్చేసింది. కానీ, త్రీ క్యాపిటల్స్ వ్యవహారంలో ముందడుగు పడలేదు.
తాజాగా, త్రీ క్యాపిటల్స్ వ్యవహారానికి వ్యతిరేకంగా కోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణను ఆగస్ట్ నాటికి వాయిదా వేసింది హైకోర్టు. దాంతో, అప్పటిదాకా మూడు రాజధానుల విషయమై ప్రభుత్వం ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోవడానికి వీల్లేని పరిస్థితి. అసలు రాష్ట్రానికి మూడు రాజధానులు ఎందుకు.? అన్న ప్రశ్నకు ఇంతవరకు ప్రభుత్వం నుంచి సరైన సమాధానమే రాలేదు.
అభివృద్ధి వికేంద్రీకరణ అన్నారు.. పరిపాలన వికేంద్రీకరణ అన్నారు.. ఇంకేవేవో కథలు చెబుతూనే వచ్చారు. ఒక్క రాజధాని అమరావతిని కాస్తయినా అభివృద్ధి చేసి వుంటే, రెండో రాజధాని.. మూడో రాజధాని విషయమై విమర్శలే వచ్చేవి కావు. ఒకదానికే దిక్కులేదు.. మూడు రాజధానులు కడతారా.? అన్న ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయింది.
వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చి రెండేళ్ళవుతోంది. ఈ రెండేళ్ళలో సంక్షేమం తప్ప, అభివృద్ధి అనేది ఏమైనా జరిగిందా.? లేనే లేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే.. కాదు కాదు.. ఆంధ్రపదేశ్.. కొన్నేళ్ళు వెనక్కి వెళ్ళిపోయిందన్న విమర్శలున్నాయి. అదే రాజధానిగా అమరావతిలో అభివృద్ధి జరిగి వుంటే, రాష్ట్రం ఖచ్చితంగా ప్రగతిపథంలోకి దూసుకెళ్ళేదే.
414613 319132This really is how to get your foot inside the door. 770603
695581 316871Many thanks for this specific information I was basically browsing all Search engines to discover it! 274201