Switch to English

వైసీపీని టెన్షన్ పెడుతున్న సర్వేలు.! అసలెందుకు భయం.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,430FansLike
57,764FollowersFollow

ఏ సర్వే అయినా చూసుకోండి, వైసీపీదే మళ్ళీ విజయం.. అని చెబుతున్నాయ్.! చాలాకాలంగా వైసీపీ చేసుకుంటున్న ప్రచారమిది. ఓ నేషనల్ మీడియా సంస్థకి ఏకంగా 8 కోట్ల పైన చెల్లించింది వైఎస్ జగన్ సర్కారు.. అదీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని జాతీయ స్థాయిలో ప్రమోట్ చేసుకోవడానికి.

ఈ ప్రమోట్ చేసుకోవడం.. అన్న మాటకు అర్థమే లేదు. జనం సొమ్ము కదా.. అడ్డగోలుగా అయినవారికి దోచి పెట్టడంలో ఇదో కొత్త కాన్సెప్ట్ అన్నమాట.! అంత సొమ్ము తిన్నాక, వైసీపీ అనుకూల సర్వేల్ని ఆ మీడియా సంస్థ ఇవ్వకుండా వుంటుందా.?

ఆ ఒక్క సర్వేనే కాదు, చాలా సర్వేల్ని వైసీపీ మేనేజ్ చేస్తూ వచ్చింది. కానీ, ఎన్నికల ముందర సర్వేల ఫలితాలు మారుతున్నాయి. ‘వైనాట్ 175’కి అనుకూలంగా గతంలో వచ్చిన సర్వేల్లో, ఇప్పుడు కాస్త రియాల్టీకి దగ్గరగా అంచనాలు కనిపిస్తున్నాయి.

తాజాగా ఓ సర్వే, వైసీపీ ఓడిపోతుందని పేర్కొంది. అది ఫేక్ సర్వే.. అంటూ, వైసీపీ షరా మామూలుగానే ఎదురుదాడి షురూ చేసింది. తమకు అనుకూలంగా సర్వే ఫలితాలుంటే, వాటిని ప్రచారం చేసుకోవడం.. ప్రతికూల సర్వేలని ఫేక్ సర్వేలనడం రాజకీయ పార్టీలకు కొత్తేమీ కాదు.

నిజానికి, ఈ తరహా సర్వేల ప్రభావం ఓటర్ల మీద వుండదు. ఓటరు ఏం చేయాలనుకుంటాడో అదే చేస్తాడు. రాజకీయ పార్టీలు కొన్ని ఓట్లను కొనగలవేమో.. అందర్నీ కొనలేవు కదా.! అలాగన్నమాట.

అయితే, ఇక్కడో పొలిటికల్ కిటుకు దాగి వుంది. సర్వేలు అనుకూలంగా వుంటే, ఆయా రాజకీయ పార్టీల తరఫున, అభ్యర్థుల తరఫున ఎన్నికల్లో ఖర్చు చేయడానికి కాంట్రాక్టర్లు, ఫైనాన్షియర్లు ముందుకొస్తారు. అది కొంత ఆయా పార్టీల గెలుపుకి సహకరిస్తుంది.

సర్వేల ఫలితాలు తేడాగా వస్తే, ఆర్థిక అండదండలు అందకుండా పోతాయ్. వైసీపీ నుంచి చాలామంది నేతలు ఔట్ అయిపోతుండడానికి కారణం ఈ సర్వేలే.!1 ఇంకొక్క రెండు మూడు సర్వేలు వైసీపీకి వ్యతిరేకంగా వస్తే.. అప్పుడిక గేమ్ పూర్తిగా మారిపోతుంది.

అందుకే, సర్వేలపై వైసీపీ తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేస్తోంది. వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల రామకృష్ణా రెడ్డి అయితే, మరీ బెంబేలెత్తిపోతున్నారు. ఈ కంగారు వైసీపీలో భయాన్ని స్పష్టంగా బయటపెట్టేస్తోంది.

కొసమెరుపేంటంటే, జనసేన పార్టీ ప్రస్తావన లేకుండా ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడుకోలేం.. అని సాక్షాత్తూ నేషనల్ మీడియానే పేర్కొంటోంది. టీడీపీతో కలిసి వెళ్ళాలా? లేదా.? అన్న విషయమై జనసేన అభిప్రాయం తీసుకున్నాకే, బీజేపీ ఓ నిర్ణయానికి వస్తుందనీ నేషనల్ మీడియానే చెబుతోంది.

సహజంగానే, ఇది వైసీపీకి అస్సలు మింగుడుపడదు. జనసేన స్థాయిని తగ్గించేందుకు చంద్రబాబుని ‘యజమాని’గా భావిస్తున్న వైసీపీ, ఇప్పుడు ఆ జనసేన రేంజ్ పెరిగే సరికి, మరింతగా వణికిపోతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...