కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ విలీనం జరగబోతోందంటూ ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. వైఎస్ షర్మిలకు, కాంగ్రెస్ పార్టీలో కీలక పదవి కూడా దక్కబోతోందనీ, ఆమె కడప ఎంపీ అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారనీ ప్రచారం జరుగుతోంది.
అయితే, పార్టీ విలీనంపై ఇంతవరకు వైఎస్ షర్మిల స్పష్టమైన ప్రకటన అయితే చేయలేదు. కానీ, కాంగ్రెస్ పార్టీతో మాత్రం తెరవెనుకాల సన్నిహితంగా మెలుగుతున్నారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల. గతంలో ఆమె బీజేపీకి కొంత అనుబంధంగా పనిచేసినట్లు రాజకీయంగా ఆరోపణలు వచ్చాయి.
ఏమయ్యిందోగానీ, ఇప్పుడామె కాంగ్రెస్ గూటికి చేరాలని తహతహలాడుతున్నారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి నేపథ్యంలో, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా ట్వీటేశారు. కాంగ్రెస్ నాయకుడిగా రాజశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి అందించిన సేవలు, అలాగే ముఖ్యమంత్రిగా ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి అందించిన సేవల్ని రాహుల్ తన ట్వీటులో గుర్తు చేసుకున్నారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డిని రాహుల్ గాంధీ గుర్తు చేసుకోవడం పట్ల వైఎస్ షర్మిల హర్షం వ్యక్తం చేశా. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. వాస్తవానికి, కాంగ్రెస్ పార్టీని కాలగర్భంలో కలిపేస్తామంటూ, వైఎస్ జగన్ అలాగే వైఎస్ విజయమ్మ.. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు.
ఆంధ్రప్రదేశ్లో అయితే, కాంగ్రెస్ పార్టీ పతనాన్ని చూడగలిగారు వైఎస్ జగన్. ఆ జగన్ కోసం గతంలో పాదయాత్ర కూడా చేసిన వైఎస్ షర్మిల, ఏపీ రాజకీయాల్ని వదిలేసి, తెలంగాణలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టాల్సి వచ్చింది. కానీ, తెలంగాణలో రాజకీయం కలిసి రాక, తిరిగి ఏపీ రాజకీయంపై దృష్టిపెట్టినట్లు కనిపిస్తోంది. రాహుల్కి వైఎస్ షర్మిల ట్విట్టర్ ద్వారా థ్యాంక్స్ చెప్పారంటే.. కాంగ్రెస్ పార్టీకి ఆమె దాదాపు దగ్గరైనట్లే భావించాలేమో.!
Thanks for sharing such a pleasant opinion, paragraph isnice, thats why i have read it entirely