YS Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, నగిరి నియోజకవర్గంలో జరిగిన ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నారు. బహిరంగ సభలనగానే, ముందుగా ‘ప్యాకేజీ, దత్త పుత్రుడు’ అనే ప్రస్తావన తీసుకురావడం ముఖ్యమంత్రికి మామూలే. ప్రతిసారీ అదే స్క్రిప్టు. అస్సలు మార్పులుండవ్.!
మంత్రి రోజా, అధినేత మెప్పు కోసం నానా తంటాలూ పడ్డారు. పవన్ కళ్యాణ్ అభిమానులు.. సినిమాలు.. అంటూ, సినిమాటిక్ డైలాగులు పేల్చేశారు. చంద్రబాబు ప్రస్తావన తెస్తూ, ‘జైలు’ అని కూడా పేర్కొన్నారామె. ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులకు జైలు విక్షలు పడుతున్నది వైఎస్ జగన్ హయాంలోనేనన్న విషయాన్ని రోజా మర్చిపోతే ఎలా.?
పూర్వాశ్రమంలో సినీ నటి అయిన రోజా, సినీ అభిమానుల గురించీ.. సినీ నటుల గురించీ, సినిమాల గురించీ వెటకారాలు చేస్తే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకేముంటుంది.? రోజా ఎలాగూ రాజకీయాల్లో కామెడీ పీస్ అయిపోయారనుకోండి.. అది వేరే సంగతి. టీడీపీలో వుండి, అప్పట్లో వైఎస్సార్ని విమర్శించిన రోజా, ఇప్పుడు వైసీపీలో వుండి, ఇతర పార్టీల్ని తిడుతున్నారు. రేప్పొద్దున్న పార్టీ మారితే.. ఆమె వాయిస్ ఎలా మారిపోతుందో ఏమో.!
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విషయానికొస్తే, ప్రతిసారీ పాడిన పాత పాటనే పాడారు. అది విద్యార్థులకు సంబంధించిన కార్యక్రమమా.? ఇంకోటా.? అన్నది అనవసరం. ఒక్కటే స్క్రిప్టు.. ఒక్కటే మాట.! కాస్తలో కాస్త నయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి ముఖ్యమంత్రి ప్రస్తావించలేదు.
పొరపాటున స్క్రిప్టుని చదవలేదా.? ఆ ప్రస్తావన తీసుకురావడం వల్ల మహిళా లోకం, ముఖ్యమంత్రిని ఛీత్కరించుకుంటోందనా.? కారణం ఏదైతేనేం, ఈ మార్పు మంచిదే. కానీ, ప్యాకేజీ ప్రస్తావన.. దత్త పుత్రుడు ప్రస్తావన జగన్ తీసుకొచ్చినప్పుడు, అక్కడికి బలవంతంగా తరలించబడ్డ జనం.. పూర్తిగా లైట్ తీసుకున్నారు.
చాలామంది సభకు బలవంతంగా తరలించబడ్డా.. సభ ప్రారంభానికి ముందే వెనుకదిరిగారు. మిగిలినోళ్ళు, సభ ప్రారంభమయ్యాక.. ఒకరొకరుగా జారుకున్నారు. ప్రజాధనం వృధా తప్ప, ఈ తరహా బహిరంగ సభల వల్ల ఏం ప్రయోజనం.?