కరోనా దెబ్బకు దేశంలో ఆర్ధికంగా కుదేలైపోయిన రంగాలెన్నో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో అర్ధంకాక కొట్టుమిట్టాడుతున్న రంగాల్లో విద్యా రంగం ఒకటి. భవిష్యత్ ను నిర్మించే అత్యంత కీలకమైన రంగం ఇదే. కరోనా దెబ్బకి స్కూళ్లు, కాలేజీలు తెరుచుకునేలా లేవు. పిల్లలు, యువత కాలేజీకి వెళ్లే పరిస్థితులు కనిపించడం లేదు. తల్లిదండ్రులే వీరిని పంపేందుకు సిద్ధంగా లేరని చెప్పాలి.
అయితే.. కొన్ని విద్యాసంస్థలు ఆన్ లైన్ క్లాసులు మొదలుపెట్టినా పుస్తకాలు లేవు. తప్పని పరిస్థితుల్లో విద్యార్ధులు కూడా అదే ఫాలో అవుతున్నారు. ఈ సమస్యను గుర్తించారు కొందరు యువకులు. దీంతో వారంతా విద్యార్ధులకు ఉచితంగా పుస్తకాలు అందించాలని నిర్ణయించారు. ఇందుకు సియోన్ ఫ్రెండ్స్ సర్కిల్ పేరుతో గ్రూప్ గా ఏర్పడి ఒక వినూత్నమైన ఆలోచనతో ముందుకొచ్చారు.
ముంబైలోని సియోన్ ప్రాంతంలో ‘మొబైల్ బుక్ కార్ట్’ పేరుతో ఓ మొబైల్ బుక్ సర్వీస్ ను ప్రారంభించారు. ఆ ప్రాంతంలోని వీధుల్లోకి ఈ బండి వెళ్తుంది. దీంతో అక్కడ ఎవరైనా విద్యార్ధులుంటే వారికి కావాల్సిన పుస్తకాలను ఉచితంగా తీసుకోవచ్చు. ఎవరి వద్దైనా తమకు అవసరం లేని పుస్తకాలు ఉంటే ఈ బండి వద్ద అప్పగించొచ్చు.
దీంతో ఈ పుస్తకాలు అవసరమైన వారు ఇదే బండి దగ్గర తీసుకుంటారు. ఇటువంటి వినూత్న ఆలోచనతో వచ్చిన యువకులపై సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో యువత ఇలా కొత్త ఆలోచనలతో సమాజానికి ఉపయోగపడేలా మంచి పనులతో ముందుకు రావడం అభినందనీయం.
546946 176180Id forever want to be update on new articles on this site, bookmarked ! . 369896