కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం, పార్లమెంటు భవనానికి మెరుగులు దిద్దేందుకోసం 12 వేల కోట్లకు పైగా వెచ్చించనుంది. దాన్నొక మహా సౌధంగా తీర్చిదిద్దబోతున్నారు. ఈ బృహత్ ప్రాజెక్టుని యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నారు. చాలా తక్కువ సమయంలో ఈ ప్రాజెక్టుని పూర్తి చేయనుండడం గమనార్హం. అంతా బాగానే వుందిగానీ, దేశంలో ఓ రాష్ట్రానికి రాజధాని లేదన్న విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ గుర్తించకపోతే ఎలా.?
ఢిల్లీని తలద్నేలా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వుండాలని ఆకాంక్షించిన ప్రధాని నరేంద్ర మోడీ, గడచిన ఐదేళ్ళ కాలంలో అమరావతి కోసం నిధుల్ని ఆశించిన మేర అందించకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పరిస్థితి ‘జీరో’ అయిపోవడానికి కారణం, రాష్ట్రంపై గత ఐదేళ్ళుగా చూపిన నిర్లక్ష్యమే.
అంతకు ముందు ఇద్దరు ఎంపీలు, పలువురు ఎమ్మెల్యేలు బీజేపీకి వుండేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితి అత్యంత దయనీయం. అరువు తెచ్చుకున్న నేతలతో ‘మేం బలంగా వున్నాం..’ అని బీజేపీ చెప్పుకోవచ్చుగాక.! గ్రౌండ్ లెవల్లో బీజేపీ ప్రస్తుత దుస్థితి ఏంటో, దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేస్తున్న నేతలకే తెలుసు. పార్లమెంటు భవనానికి హంగులు అవసరమే.
అదే సమయంలో, భారతదేశంలోని ఓ రాష్ట్రానికి రాజధాని లేదన్న అపప్రధ వుండకూడదన్న కనీన ఇంగితాన్ని ప్రధాని నరేంద్ర మోడీ గుర్తెరగాలి. ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నది. దురదృష్టవశాత్తూ చంద్రబాబు సర్కార్ ఆ దిశగా కేంద్రంపై ఒత్తిడి చేయలేకపోయింది.. ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం అంతకన్నా దారుణంగా చేతులు ముడుచుక్కూర్చుంది కేంద్రాన్ని ప్రశ్నించే విషయంలో.
618517 349156I adore foregathering useful data , this post has got me even more info! . 184961