Switch to English

కేసీఆర్ వెన్నుపోటు.. అర్థమవుతోందా జగన్.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

‘‘ప్రతి నీటి బొట్టునూ జాగ్రత్తగా ఒడిసి పట్టుకుని తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి వినియోగించాలి. ఈ విషయంలో రెండు రాష్ట్రాలూ కలిసి పనిచేస్తాయి’’ అని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్న మాటలన్నీ నీటి మూటలేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నికర జలాల్లో వాటా సంగతి పక్కనపెడితే, మిగులు జలాలను ఏపీ వాడుకోవడంపైనా తెలంగాణ సర్కారు అభ్యంతరం తెలుపుతోంది.

పోతిరెడ్డు ప్రాజెక్టు ద్వారా అధికంగా నీటిని తరలిస్తున్నారని, వెంటనే అడ్డుకోవాలంటూ కృష్ణా రివర్ బోర్డుకు ఫిర్యాదు చేసింది. ఏపీ అధికారులు అధికంగా నీటిని తరలిస్తూ గణాంకాలు మాత్రం తక్కువగా నమోదు చేస్తున్నారని ఆరోపించింది. ఇప్పటివరకు 10 టీఎంసీల నీటిని తరలించినా.. లెక్కల్లో మాత్రం 7 టీఎంసీలు మాత్రమే నమోదు చేశారని పేర్కొంది. వాస్తవానికి శ్రీశైలం ప్రాజెక్టు నీటి మట్టం 840 అడుగులకు చేరితే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు నీటిని తరలించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో 870 అడుగుల వరకు నీళ్లున్నాయి. దీంతో శ్రీశైలం గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేశారు.

ఈ నేపథ్యంలో ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో ఏపీ సర్కారు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు నీటి తరలింపు ప్రారంభించింది. దీనివల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం ఉండదని అధికారులు చెబుతున్నారు. కేవలం ఎగువ నుంచి భారీగా వరద వస్తున్న తరుణంలోనే పోతిరెడ్డుపాడు ప్రాజెక్టు ద్వారా నీటిని తరలిస్తున్నట్టు చెప్పారు. కిందకు వృథాగా పోయే నీటిని మాత్రమే తాము పోతిరెడ్డిపాడు ద్వారా ఎత్తిపోస్తున్నట్టు వెల్లడించారు.

వాస్తవానికి మిగులు జలాలపై దిగువ రాష్ట్రాలకే పూర్తి హక్కులు ఉంటాయి. అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేయడం విస్మయం కలిగిస్తోందని పలువురు అంటున్నారు. ‘‘వరద వెల్లువలా వస్తున్న నేపథ్యంలో పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును ఆన్ చేయక తప్పని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం వినియోగిస్తున్న నీరంతా అధికంగా వస్తున్న వరద నీరే. అయినా తెలంగాణ ప్రభుత్వం దీనిపై ఫిర్యాదు చేసిందంటే కారణం ఒకటే కనిపిస్తోంది. రేపు వరద నీరు తగ్గి ప్రాజెక్టులో నిల్వ ఉన్న నీటిలో అధిక వాటా పొందాలన్న తలంపుతోనే తెలంగాణ సర్కారు పోతిరెడ్డిపాడుపై ఫిర్యాదు చేసి ఉంటుందని భావిస్తున్నాం’’ అని ఏపీ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...