Switch to English

‘విచక్షణ’తోనే వినియోగిస్తున్నారా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

విచక్షణ అధికారాలు ఆంధ్రప్రదేశ్ లో మరోసారి చర్చకు వచ్చాయి. మొన్న శాసనమండలిలో ఇవే అధికారాలు వినియోగించి రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపిస్తూ మండలి చైర్మన్ షరీఫ్ తీసుకున్న నిర్ణయంపై దుమారం రేగిన సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తన విచక్షణ అధికారాలతో ఏపీలో స్థానిక ఎన్నికలను ఆరు వారాలపాటు వాయిదా వేయడంపై అధికార పార్టీ తీవ్రంగా మండిపడుతోంది. వాస్తవానికి ఈ రెండు విచక్షణ నిర్ణయాలూ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా కనిపిస్తుండటంతో అధికార పార్టీ ఆగ్రహంతో రగిలిపోతోంది.

ఈ నేపథ్యంలో విచక్షణ అంటే ఏమిటి, నిజంగా విచక్షణతోనే ఈ అధికారాలను వినియోగిస్తున్నారా అనే చర్చ తెరపైకి వచ్చింది. అత్యున్నత రాజ్యాంగ సంస్థలు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో నిబంధనలు అనుమతించినా, అనుమతించకపోయినా విచక్షణ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశాన్ని రాజ్యాంగం కల్పించింది. అయితే, వీటిని ఎవరికి అనుకూలంగా వారు మలుచుకుని పైచేయి సాధిస్తున్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు వేసే విషయంలోనూ తాత్సారం చేయడం చూస్తున్నాం. ఇదేంటని అడిగితే.. అది స్పీకర్ అధికారం అని, అందులో న్యాయస్థానాలు కూడా జోక్యం చేసుకోజాలవనే వాదన తేవడం చూశాం.

మొన్న మండలి చైర్మన్ షరీఫ్ నిర్ణయమైనా, ఇప్పుడు ఎస్ఈసీ రమేశ్ కుమార్ నిర్ణయమైనా.. వాటిని తీసుకోవడం వెనుక సదుద్దేశాలు ఉండొచ్చు. కానీ ఆయా నిర్ణయాలు తీసుకోవడంలో వారు అనుసరించిన వైఖరే పలు సందేహాలకు తావిస్తోందన్నది నిర్వివాదాంశం. కరోనా వైరస్ ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంల భాగంగా ఎన్నికల వాయిదా వేయడం సరైన నిర్ణయమే. అయితే, దీనిపై ఎస్ఈసీ సంబంధిత అధికారులతో మాట్లాడి తన నిర్ణయం వెలువరిస్తే ఈ సమస్యే ఉండేది కాదు. ఇప్పుడు ప్రభుత్వం ప్రశ్నిస్తోంది అదే.

ఎన్నికల వాయిదాపై ఎవరితో సంప్రదించారు అని అడిగితే.. తాను కేంద్ర అధికారులతో మాట్లాడానని ఆదివారం సాయంత్రం విడుదల చేసిన రెండో ప్రెస్ నోట్ లో ఎస్ఈసీ పేర్కొన్నారు. అయితే, వారి వివరాలు మాత్రం ఆయన పొందుపరచలేదు. ఎన్నికల వాయిదా అనే కీలక నిర్ణయం తీసుకునే ముందు వైద్య అధికారులతోనో లేక సీఎస్ తోనే మాట్లాడితే ఇది వివాదాస్పదం అయ్యేది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పైగా ఎస్ఈసీ కుమార్తె శరణ్య.. చంద్రబాబు హాయంలో పదవి పొంది ఉండటం కూడా ఆయన తాజాగా తీసుకున్న నిర్ణయం శంకించే విధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ఏయే అధికారులతో ఎప్పుడు మాట్లాడారో వివరిస్తే తనపై వస్తున్న ఆరోపణలకు సమాధానం ఇచ్చినట్టు అవుతుంది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

‘భజే వాయువేగం’ నుంచి ‘సెట్ అయ్యిందే’ సాంగ్ విడుదల

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ( Karthikeya ) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'భజే వాయువేగం'. ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను మూవీ టీం రిలీజ్ చేసింది. 'సెట్ అయ్యిందే'...

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...