ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి విడిపోయిన తరువాత అమరావతిని రాజధానిగా ప్రకటించి అద్భుతమైన రాజధానిగా తీర్చిదిద్దాలని తెలుగుదేశం పార్టీ భావించిందని. ఆ ప్రభుత్వం అధికారంలో ఉండగా 2015 వ సంవత్సరంలో భూములను సేకరించడం మొదలు పెట్టింది. భూసేకరణ పద్దతి ద్వారా దాదాపుగా 33 వేల ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించింది. అలా రైతుల వద్ద నుంచి సేకరించిన భూమిలో అద్భుతమైన రాజధాని నిర్మించాలని బాబు అనుకున్నారు.
భూములు సేకరించారు. రాజధాని నిర్మాణం కోసం అనేక సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. నిర్మాణాల డిజైన్ చేతికి వచ్చేసరికి రెండేళ్లకు పైగా సమయం పట్టింది. 2018 చివరి నాటికి మొదటిదశ నిర్మాణాలు పూర్తి చేయాలనీ అనుకున్నా.. కొన్ని కారణాల వలన ఆలస్యం అయ్యింది. సరే మరోసారి అధికారంలోకి వస్తాం కదా అప్పుడు నిర్మాణాలు పూర్తి చేయాలని అనుకున్నారు. కానీ, అక్కడ జరిగింది వేరు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
ఆరు నెలల్లో రాజధాని గురించి ఎలాంటి మాటలు మాట్లాడలేదు. పైగా రాజధాని విషయంలో అమరావతి ఉండొచ్చు ఉండకపోవచ్చు అనే మాటలు కూడా వచ్చాయి. ఇప్పుడు మూడు రాజధానుల ప్రస్తావన తెరపైకి వచ్చింది. మూడు రాజధానుల ప్రస్తావన తెరపైకి రాజధాని ప్రాంతం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
తమ పంటపొలాలను ప్రభుత్వానికి ఇచ్చామని, భవిష్యత్తులో మంచి రాజధాని వస్తే తమ జీవితాలు బాగుపడతాయని చెప్పి రాజధాని భూములు ఇచ్చామని, కానీ, ఇప్పుడు ప్రభుత్వం మూడు రాజధానుల ప్రస్తావన తెస్తోందని, ఇది తమకు ఎన్నటికీ సమ్మతి కాదని, మూడు రాజధానులు తమకు అవసరం లేదని, రాజధాని ఉంటె అమరావతిలో ఉండాలి, లేదంటే 2015లో భూములను ఎలా ప్రభుత్వానికి అప్పగించామో, అలానే తమకు తిరిగి అప్పగించాలని రాజధాని ప్రాంత వాసులు అంటున్నారు.
మరి ఈ విషయంలో ప్రభుత్వం ఎలా చేస్తుందో చూడాలి. రైతులకు భూములను తిరిగి అప్పగిస్తుందా చూద్దాం.
15173 135001Hi there, I discovered your blog by way of Google while looking for initial aid for a heart attack and your post looks really interesting for me. 63562
948087 205464I was looking for this. Really refreshing take on the details. Thanks a great deal. 579561