ఏపీలో కరోనా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల కొనుగోలులో రేగిన దుమారం ఇంకా చల్లారలేదు. ఈ కిట్ల కొనుగోలులో అవినీతి జరిగిపోయిందని విపక్షాలు ఆరోపించగా.. అలాంటిది ఏమీ లేదని సర్కారు తేల్చి చెప్పింది. పైగా అధికారుల ముందుచూపు కారణంగా కిట్ రేట్ తగ్గిందని, ఛత్తీస్ గఢ్ కు సరఫరా చేసిన ధరనే తీసుకోవడానికి కంపెనీ అంగీకరించిందంటూ సీఎం జగన్ వివరణ ఇచ్చారు. ఈ
సందర్భంగా అధికారులను ఆయన అభినందించారు కూడా. అయినప్పటికీ విపక్షాలు మాత్రం వెనక్కి తగ్గడంలేదు. ఈ మొత్తం వ్యవహారంలో గోల్ మాల్ జరిగిందని, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతోనే సర్కారు దిద్దుబాటు చర్యలు చేపట్టిందని, ఒకవేళ సోషల్ మీడియా దీనిని పట్టించుకోకపోయి ఉంటే కమీషన్లు కొట్టేసేవారేనంటూ దుయ్యబడుతున్నాయి.
కేంద్రం రూ.795 వెచ్చించి గుర్గావ్ లోని జీన్స్ టూమీ ప్రైవేటు లిమిటెడ్ అనే కంపెనీ దగ్గర కొనుగోలు చేయగా.. ఛత్తీస్ గఢ్ దక్షిణ కొరియాకు చెందిన ఎస్ డీ బయోసెన్సర్స్ అనే కంపెనీ నుంచి రూ.337కి కిట్ కొనుగోలు చేసింది. ఏపీ కూడా ఇదే కంపెనీ కిట్స్ ను కొనుగోలు చేసింది. ఛత్తీస్ గఢ్ ఓపెన్ టెండర్లు పిలిచి, ఎస్ డీ బయోసెన్సర్స్ కు కాంట్రాక్టు ఇవ్వగా.. ఏపీ మాత్రం ఈ కంపెనీ నుంచి నేరుగా కొనలేదు. హైదరాబాద్ కు చెందిన శాండర్ మెడికియాడ్స్ ప్రైవేటు లిమిటెడ్ అనే సంస్థ ద్వారా వీటిని తెప్పించింది. అంటే.. ప్రభుత్వానికి, ఎస్ డీ బయోసెన్సర్స్ కి మధ్యవర్తిగా శాండర్ వ్యవహరించింది.
ఈ నేపథ్యంలోనే రేటులో అంత తేడా వచ్చిందని విపక్షాలు పేర్కొంటున్నాయి. ఏపీలో మందులు, వైద్య పరికరాలను కొనుగోలును పర్యవేక్షించే ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ ఫ్రాస్టక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఏపీఎంఎస్ఐడీసీ)కి శాండర్ మెడికియాడ్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీకి మధ్య కిట్ల సరఫరాపై ఒప్పందం కుదిరింది. నేరుగా ఎస్ డీ బయోసెన్సార్స్ నుంచి తెప్పించుకునే వీలున్నప్పటికీ, మధ్యలో శాండర్ కంపెనీ ఎలా వచ్చిందని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
కేవలం కమీషన్ల కోసం ఈ కంపెనీని తెరపైకి తెచ్చారని ఆరోపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి టెండర్లు ఎప్పుడు పిలిచారని ప్రశ్నిస్తున్నాయి. నిజానికి శాండర్ కంపెనీకి ఇచ్చిన పర్చేజ్ ఆర్డర్ లో రేటు విషయమై ముందుగానే క్లాజ్ పెట్టారు. ఇప్పుడు దాని ఆధారంగానే రూ.337 మాత్రమే చెల్లిస్తానని ఆ కంపెనీకి తెలిపారు. ఆ కంపెనీ ఇందుకు అంగీకరించిందని కూడా వెల్లడించారు. ఒకవేళ ఆ కంపెనీ అందుకు అంగీకరించకపోయినా ప్రభుత్వం మాత్రం చేసేదేమీ లేదు.
ఎందుకంటే దేశంలోని ఏ రాష్ట్రానికైనా ఇంతకంటే తక్కువ ధరకు వీటిని సరఫరా చేస్తే అదే ధర తాము చెల్లిస్తామని క్లాజ్ లో పేర్కొన్నారు. కానీ ఇప్పటివరకు శాండర్ కంపెనీ ఏపీకి మాత్రమే ఈ కిట్లను సరఫరా చేసింది. ఛత్తీస్ గఢ్ నేరుగా ఎస్ డీ బయోసెన్సార్స్ నుంచే కొనుగోలు చేసినందున ఇక్కడ శాండర్ ప్రస్తావన లేదు. ఈ నేపథ్యంలో తాము ఏ ఇతర రాష్ట్రానికీ సరఫరా చేయనందున.. ఇదే ధర చెల్లించాలని పట్టుబడితే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. కిట్ల కొనుగోలులో విపక్షాల ఆరోపణలు, సందేహాలు ఇంకా కొనసాగుతున్నందున ప్రభుత్వం దీనిపై మళ్లీ వివరణ ఇస్తుందో లేదో చూడాలి.
858819 162945magnificent submit, really informative. I ponder why the opposite experts of this sector dont realize this. You must proceed your writing. Im sure, youve a fantastic readers base already! 374560