నేడు ఉదయం నుండి దగ్గుబాటి అభిరామ్ ప్రయాణిస్తున్న కారు మణికొండలో యాక్సిడెంట్ కు గురయ్యింది అంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దగ్గుబాటి ఫ్యామిలీ ఆ వార్తలను కొట్టి పారసింది. అందుకు సంబంధించి ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేసి ఆ యాక్సిడెంట్ కు తమ ఫ్యామిలీ మెంబర్స్ కు సంబంధం లేదు అంటూ మీడియాకు పంపిన ప్రెస్ నోట్ లో పేర్కొనడం జరిగింది.
మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని ఆ యాక్సిడెంట్ కు కారణం మరో అభి అయ్యి ఉంటాడేమో అన్నట్లుగా వారు సోషల్ మీడియా ద్వారా అనుమానాలు వ్యక్తం చేయడంతో జబర్దస్త్ అదిరే అభి గురించి ప్రచారం మొదలయ్యింది.
దగ్గుబాటి అభిరామ్ కానట్లయితే జబర్దస్త్ అభి అయ్యి ఉంటాడు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలవ్వడంతో వెంటనే అభి స్పందించాడు. మణికొండలో కారు యాక్సిడెంట్ గురించి వస్తున్న వార్తలు నా గురించి కావు. అది నేను కాదు అంటూ అభి పేర్కొన్నాడు. ఒక వైపు దగ్గుబాటి వారు తమ కుటుంబ సభ్యుడు కాదంటూ ప్రకటించడంతో పాటు అదిరే అభి కూడా అది నేను కాదు అంటూ చెప్పడంతో ఇంతకు ఆ అభి ఎవరు అయ్యి ఉంటారు అంటూ నెట్టింట చర్చించుకుంటున్నారు. ఈ యాక్సిడెంట్ కు సంబంధించి పోలీసులు ఎలాంటి ప్రకటన చేయలేదు. కనుక వారు ఏదైనది క్లారిటీ ఇచ్చే వరకు ఏ అభి అనేది తెలిసే అవకాశం లేదు.