స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు తన రేంజ్ ను మరింతగా పెంచుకున్నాడు. ఇన్నాళ్లూ టాప్ 6 లో ఒకడిగా ఉంటూ వస్తున్నా కానీ అల్లు అర్జున్ ను టాప్ హీరోగా పరిగణించే పరిస్థితి లేదు. అయితే సరైనోడు, అల వైకుంఠపురములో వంటి విజయాలతో తాను కూడా కలెక్షన్స్ సునామీ సృష్టించగలనని నిరూపించాడు బన్నీ. ముఖ్యంగా అల వైకుంఠపురములో చిత్ర విజయం బన్నీ రేంజ్ ను ఎంతగానో పెంచింది. ఇదిలా ఉండగా అల్లు అర్జున్ పై తాజాగా వచ్చిన ఒక కథనం ఇప్పుడు వివాదాలకు దారి తీస్తోంది. నేషనల్ మీడియాలో వచ్చిన ఈ కథనం చూస్తుంటే చాలా ఈజీగా పెయిడ్ ఆర్టికల్ అని అర్ధమైపోతుంది.
దాని ప్రకారం అల్లు అర్జున్ ఇండస్ట్రీలో టాప్ హీరో అని, రాజమౌళితో పనిచేయకుండా ఆ స్థాయిని, కలెక్షన్స్ ను అందుకున్న హీరో అల్లు అర్జున్ ఒక్కడే అని రాసారు. అంతేకాకుండా అల వైకుంఠపురములో బాహుబలి 1 అండ్ బాహుబలి 2 కలెక్షన్స్ ను దాటేసిందని కూడా రిపోర్ట్ చేసారు. ఈ కథనం ప్రకారం రాజమౌళితో పనిచేస్తేనే తెలుగు హీరోలకు ఒక గుర్తింపు వస్తుంది కానీ బన్నీ విషయంలో అలా జరగకుండానే అయిపోయింది అన్నట్లుగా ఉంది. ఇది చాలా ఓవర్ గా ఉందంటూ తెలుగు ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు.
నిజానికి రాజమౌళితో సినిమా చేయకుండానే మహేష్ బాబు వరసగా మూడు భారీ హిట్స్ ను అందించాడు. నార్త్ లో విశేషమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. అల వైకుంఠపురములో టికెట్స్ మొదటి మూడు వారాలు ఏ రేంజ్ లో పెంచారో అందరికీ తెలుసు. అందుకనే భారీ కలెక్షన్స్ సాధ్యమయ్యాయి. ప్యాన్ ఇండియా ప్లాన్స్ లో ఉన్న బన్నీ తనను తాను టాప్ అని ప్రోజెక్ట్ చేసుకోవడానికే ఇలాంటి ఆర్టికల్స్ రాయించుకుంటున్నాడని అంటున్నారు.
467016 223726I believe this site contains some really amazing data for every person : D. 194733