వైకాపా గుంటూరు జిల్లాలో 17 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉంటె ఇందులో 15 చోట్ల వైకాపా విజయం సాధించింది. ఇది ఆ పార్టీకి ఎంతగానో పేరు తెచ్చిపెట్టింది. గుంటూరు, కృష్ణ, ప్రకాశం మూడు జిల్లాల్లో మొత్తం 45 నియోజక వర్గాలు ఉన్నాయి. ఇందులో 37 స్థానాల్లో వైకాపా విజయం సాధించడం విశేషం. అటు ప్రకాశం జిల్లాలో 12 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉంటె ఇందులో 8 చోట్ల వైకాపా విజయం సాధించింది. సాధారణంగా ఈ మూడు జిల్లాల్లో గతంలో తెలుగుదేశం పార్టీకి మంచి పట్టు ఉన్నది.
కానీ, ఈసారి వైకాపా పట్టును సాధించింది. రాజధాని ప్రాంతంలో కూడా వైకాపా విజయం సాధించింది. ఇది పెదకూరపాడు, మంగళగిరి, అచ్చెంపేట, తుళ్లూరు పరిసర ప్రాంతాల కిందకు వస్తుంది. మెయిన్ గా మంగళగిరి ప్రాంతం కావడంతో అమరావతి రీజియన్ లోని 29 గ్రామాలు ఎక్కువగా మంగళగిరి కిందకు వస్తాయి. ప్రస్తుతం అమరావతి ప్రాంతంలో ఎలాంటి రగడ జరుగుతుందో తెలిసిందే.
రైతులు ధర్నాలు చేస్తున్నారు. రాస్తారోకో చేస్తూ చేస్తున్నారు. నిరసనలు చేస్తున్నారు. ఎప్పుడైతే అమరావతిని కాదని కార్యనిర్వహణ రాజధానిగా విశాఖను ప్రకటించారో అప్పటి నుంచే రైతులు ఆందోళన చేపట్టడం మొదలుపెట్టారు. కార్యనిర్వహణ రాజధాని అనే అక్కడి నుంచే పరిపాలన మొత్తం జరుగుతుంది. అమరావతిలోని ప్రజలు ఇబ్బందులు పడాల్సిన ఆవశ్యకత వస్తుంది.
రైతులు తమ భూములను రాజధానికోసం ఇచ్చారు. ఇప్పుడు అమరావతిని పక్కన పెడితే భూములు ఇచ్చిన రైతులు ఏం కావాలి. మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీపైన విరుచుకుపడిన వైకాపా ఎమ్మెల్యేలు సడెన్ గా ఇప్పుడు సైలెంట్ అయ్యారు. ఆళ్ళ రామకృష్ణ ఈ విషయంపై మాట్లాడటం లేదు. సైలెంట్ అయ్యారు. రైతులకు అయన సమాధానం చెప్పాల్సి ఉన్నది. తాడికొండ ఎమ్మెల్యే సైలెంట్ అయ్యింది. గుంటూరు జిల్లాలో 17 స్థానాలు ఉంటె అందులో 15 చోట్ల వైకాపాను గెలిపించిన ప్రజలకు వైకాపా ఎమ్మెల్యేలు ఏమని సమాధానం చెప్తారు. సైలెంట్ గా ఉంటె అర్ధం లేదు కదా.
542106 558252There is noticeably lots of funds to comprehend this. I assume you created certain nice points in functions also. 721256