గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే కూడా జనసేన పార్టీ వెంట లేరిప్పుడు. అలాంటి రాజకీయ పార్టీ, కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీకి మిత్రపక్షం. ఇందులో రహస్యమేమీ లేదు. అయితే, ‘మీ మిత్రపక్షమే అధికారంలో వుంది కదా. మీ సత్తా ఏంటో ఢిల్లీలో చూపించండి.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపండి..’ అంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఉచిత సలహా ఇచ్చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి.
22 మంది లోక్సభ సభ్యులు, 151 మంది శాసన సభ్యులు 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచారు. రాష్ట్రంలో వైసీపీదే అధికారం. ఇతర పార్టీల నుంచి కూడా ప్రజా ప్రతినిథుల్ని లాగేసుకున్న ఘన చరిత్ర వైసీపీది. ఆ ఫిరాయింపుల మీద శ్రద్ధ.. అయినవారికి సలహాదారులుగా పదవులు ఇచ్చుకోవడం మీద శ్రద్ధ.. అన్నిటికీ మించి చీటికీ మాటికీ పత్రికల్లో పెద్దపెద్ద ప్రకటనలు ఇచ్చుకోవడమ్మీద శ్రద్ధ పెట్టడం కాదు.. చేతనైతే, కేంద్రం ‘మెడలు వంచి’, ప్రత్యేక హోదా సాధించాలి.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపాలి. అంతేగానీ, విపక్షాల మీద.. అందునా, రాష్ట్రంలో అసలు ఏ చట్ట సభకూ ప్రాతినిథ్యం లేని జనసేన పార్టీ ‘సత్తా’ చూపించాలని ఓ ప్రభుత్వ సలహాదారు వ్యాఖ్యానించడమేంటి.?
నిజమే, పవన్ కళ్యాణ్ కూడా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి, తెస్తారు కూడా. ప్రజా ప్రతినిథుల పరంగా ఏమాత్రం బలం లేకపోయినా, జనసేన అధినేత హోదాలో కేంద్ర హోం మంత్రిని కలిసి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపెయ్యాలంటూ ఎలా పవన్ డిమాండ్ చేయగలిగారు.? ప్రభుత్వం, బోల్డంతమంది ప్రజా ప్రతినిథులు, బోల్డంత పలుకుబడి వున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కావొచ్చు, సుదీర్ఘ రాజకీయ అనుభవం వున్న చంద్రబాబు కావొచ్చు.. ఎందుకు ఢిల్లీకి వెళ్ళి ఏపీ వాయిస్ని బలంగా వినిపించలేకపోయారు.?
ప్రతిపక్షం ఏనాడో చేతులెత్తేసింది.. అదికార పక్షం కూడా చేతులెత్తేసి, బాధ్యతల నుంచి తాము తప్పుకున్నట్లు ప్రకటిస్తే.. పవన్ కళ్యాణ్కి తప్పదు, ఆయనే మొత్తం బాధ్యతల్ని భుజానికెత్తుకుంటారేమో.!
842581 962677The urge to gamble is so universal and its practice so pleasurable, that I assume it ought to be evil. – Heywood Broun 129838