Switch to English

మేం జయించాం.. మేం చంపుతాం: వైరల్ గా మారిన పోస్టర్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

శత్రువు శత్రువు మిత్రుడు అనేది ఎక్కడైనా వర్తిస్తుంది. భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లో భారత సైనికుల చేతిలో చైనా సైనికులు చావుదెబ్బ తిన్నారనే వార్త మనకే కాకుండా మరో రెండు దేశాలకూ సంతోషం కలిగించింది. చైనా పెత్తనాన్ని సహించలేని హాంకాంగ్ అందులో ఒకటైతే.. చైనా పొరుగునే ఉన్న తైవాన్ మరొకటి. లడఖ్ ఘర్షణల్లో 43 మంది చైనా సైనికులు మరణించి ఉంటారనే వార్త తైవాన్ కు చాలా ఆనందం కలిగించింది.

ఈ నేపథ్యంలో తైవాన్ కు చెందిన ఎల్ఐహెచ్ కేజీ అనే సోషల్ మీడియా సైటులో హో సా లై అనే వ్యక్తి పంపించిన పోస్టర్ ఒకటి ప్రచురితమైంది. అందులో శ్రీరాముడు డ్రాగన్ పైకి విల్లు ఎక్కుపెట్టినట్టుగా ఉంది. దానిపై ‘మేం జయించాం.. మేం చంపుతాం’ అనే క్యాప్షన్ కూడా ఉంది. ఇది తైవానీలను విపరీతంగా ఆకర్షించింది. చైనాకు హెచ్చరికలా ఉన్న ఈ పోస్టర్ ను వారు విపరీతంగా షేర్ చేయడంతో బాగా వైరల్ అయింది.

అలాగే మిల్క్ టీ అలయెన్స్ ట్విట్టర్ పోస్టులను కూడా ఈ సైటు ప్రచురించింది. ఆసియాలో పాలతో తయారు చేసిన టీ తాగే దేశాల కూటమికి సంకేతంగా సోషల్ మీడియాలో మిల్క్ టీ అలయెన్స్ ను కొందరు నెటిజన్లు ఏర్పాటు చేశారు. ఇందులో భారత్ తోపాటు హాంకాంగ్, తైవాన్, థాయ్ లాండ్ ఉన్నాయి. ఈ దేశాలలో పాలతో తయారుచేసిన టీ తాగుతారు. అయితే, చైనాలో పాల టీ తాగేవారు కాదు. ఇటీవల కాలంలో అక్కడ కూడా పాల టీ తాగేవారు క్రమంగా పెరుగుతున్నారు.

ఇక తమపై చైనా పెత్తనాన్ని హాంకాంగ్ సహించడంలేదు. వారు స్వతంత్రంగా ఉండటానికి ఆందోళనలు చేస్తున్నారు. చైనా వాటిని ఎంతగా అణచివేస్తున్నా.. ప్రజలు మాత్రం వెనక్కి తగ్గడంలేదు. అలాగే తైవాన్ ను కూడా తమ భాభాగంగానే చైనా క్లెయిమ్ చేసుకుంటూ ఉంటుంది.

నిజానికి చైనాకు సరిహద్దుల్లో ఉన్న దేశాలతోనే కాదు.. ఎక్కడో సుదూరంగా ఉన్న దేశాలతోనూ గొడవలున్నాయి. డ్రాగన్ కంట్రీ 14 దేశాలతో సరిహద్దులు పంచుకుంటుండగా.. ఏకంగా 23 దేశాలతో గొడవలు ఉండటం ఆ దేశ సామ్రాజ్య కాంక్షకు నిదర్శనం. ఈ నేపథ్యంలో భారత పక్షానే తాము ఉన్నామంటూ తైవానీలు సోషల్ మీడియాలో ఈ పోస్టర్ షేర్ చేస్తున్నారు.

మనదేశంలో కరోనా వైరస్ పై పోరుకు తైవాన్ పది లక్షల మాస్కులు విరాళంగా పంపించింది. మన పొరుగు దేశాలను చైనా ఎలా తన వైపు తిప్పుకుంటుందో.. మనం కూడా చైనా పొరుగు దేశాలతో సఖ్యత పెంచుకోవాల్సిన అవసరం ఉంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...