తెలంగాణలో ఎంపీ ఎన్నికల ప్రచారం ముగింపుదశకు వస్తున్నకొద్దీ అభ్యర్థుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఇన్నాళ్లూ రోడ్షోలు, సభలతో జరిగిన ప్రచారాన్ని మిగిలిన ఈ రెండు, మూడ్రోజులపాటు మరింత పకడ్బందీగా ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఇన్ని రోజుల ప్రచారం ఒక ఎత్తయితే.. ఇప్పుడు ఓటర్లను ఆకట్టుకోవడమే అసలు సిసలు సమస్య. అందుకే అసలు యాక్షన్ ఇప్పుడే స్టార్టయిందని చెప్పుకోవాలి. మంగళవారం సాయంత్రం ఐదుగంటల వరకు మిగిలున్న ఈ విలువైన సమయాన్ని ఒక్కక్షణం కూడా వృధా చేయకుండా ఉండేలా ప్లాన్చేసుకున్నారు. దినమంతా సభలు, సమావేశాలు.. రాత్రయితే బూత్ మేనేజ్మెంట్ నిర్వహణపై చర్చలు.. ఓటర్లను పోలింగ్బూత్కు తీసుకురావడంపై మల్లగుల్లాలు పడుతున్నారు. గెలుపే లక్ష్యంగా అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. అంతటితో ఆగకుండా.. అసంతృప్తితో పార్టీకి దూరమైన కార్యకర్తలను బుజ్జగిస్తున్నారు.
ఇవన్నీ ఒక ఎత్తయితే.. గ్రామీణ, పట్టణ నియోజకవర్గాల్లో ఓట్ల పండగలో అసలైన ఘట్టానికి తెరలేచింది. గెలిచేందుకు కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధమైన అభ్యర్థులు చివరి బ్రహ్మాస్త్రంగా మద్యం, డబ్బు పంపీణీతోపాటు కానుకలను ఎరగావేస్తున్నారు. పోటాపోటీగా ఓటర్ల కరుణ పొందేందుకు ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత పోలీసు, ఆదాయ పన్నుల శాఖ అధికారుల తనిఖీల్లో రాష్ట్రవ్యాప్తంగా శనివారం నాటికి 41.04 కోట్ల రూపాయలు పట్టుబడగా.. అందులో రూ.20 కోట్లు చివరి మూడ్రోజుల్లో పట్టుబడదే. మద్యానికైతే లెక్కేలేదు. టఫ్ఫైట్ ఉంటుందనుకుంటున్న ఆదిలాబాద్, నిజామాబాద్, సికింద్రాబాద్, ఖమ్మం, భువనగిరి, నల్లగొండ, మల్కాజ్గిరి స్థానాల్లో ఒక్కో ఓటుకు రూ.2 వేలకుపైనే ముట్టజెప్పుతున్నట్లు సమాచారం. పేద, మధ్య తరగతి ప్రజల ఓట్లు లక్ష్యంగానే ఈ ప్రలోభాలు జోరుగా సాగుతున్నాయి.
కోట్లు ఖర్చుచేస్తున్నా.. ఓటింగ్శాతం పెరగకపోతే ఇబ్బందులు తప్పవనే అంశం అభ్యర్థులకు నిద్రలేకుండా చేస్తుంది. ఓటింగ్ సరళి అనుకున్నట్లుగా లేకపోతే.. ఏప్రిల్ 11న ఎన్నికలు జరిగి.. మే 23వరకు ఫలితాలకోసం ఎదురుచూసి అభ్యర్థులకు బీపీ, షుగర్ పెరిగిపోతాయి. అందుకే ఒపీనియన్ లీడర్లను, వీలున్నచోట నేరుగా ఓటర్లను ప్రలోభపెట్టయినా పోలింగ్ బూత్కు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా హైదరాబాద్, నగర శివార్లలోని ప్రాంతాల్లో అభ్యర్థులకు ఈ ఫీవర్ ఎక్కువగా ఉంది. గతేడాది డిసెంబర్లో జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో సగటున 73 శాతం పోలింగ్ నమోదు కాగా, రాజధాని పరిధిలోని నియోజకవర్గాల్లో 49 శాతం, శివారు ప్రాంతాల్లో 55శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. ఈసారి ఈ సంఖ్య వచ్చినా పర్వాలేదు.. కానీ ఇంతకన్నా తక్కువ వస్తే.. మాత్రం అభ్యర్థుల హార్ట్బీట్ పెరిగిపోతుందనడంలో సందేహం లేదు.
ఓవైపు అభ్యర్థులు ప్రయత్నాలు జరుగుతుంటే ఆయా పార్టీల అధిష్టానాలు మాత్రం తమకు వీలున్న మార్గాల్లో సర్వే రిపోర్టులను తెప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో కేసీఆర్ది మొదటిస్థానం. నోటిఫికేషన్ వచ్చాక ఇప్పటివరకు నాలుగుసార్లు కేసీఆర్ సర్వే చేయించారు. చివరి రెండ్రోజుల్లో ట్రెండ్ను తెలుసుకునేందుకు ఇంటెలిజెన్స్ పోలీసుల సాయంతో మరో సర్వే కూడా చేయిస్తున్నారు. సోమవారం కల్లా ఈ సర్వే సీఎం చేతికి అందుతుందని.. దీని ఆధారంగా చివరి రెండ్రోజుల్లో ఏం చేద్దామనేదానిపై వ్యూహరచన చేసే అవకాశం ఉంది. అటు, బీజేపీ, కాంగ్రెస్లు కూడా తాము అంచనాలు పెట్టుకున్న నియోజకవర్గాల్లో పరిస్థితేంటనే దానిపై బేరీజు వేసుకుంటున్నాయి. ఓవరాల్గా చూస్తే ఎన్నికలకు ముందు టీఆర్ఎస్కు పూర్తి అనుకూలంగా ఉందన్న వాతావరణంలో మార్పు వచ్చిందనేది సుస్పష్టం. ఇన్ని ప్రలోభాలు, కళ్లముందు వాస్తవాలు చూసిన తర్వాత ఓటరురాజు ఎటువైపు మొగ్గుతాడనేది మాత్రం మే 23నే తెలుస్తుంది.
233028 869198hey very good web site i will definaely come back and see again. 776199
575013 381337So funcy to see the post within this blog. Thank you for posting it 210936
242657 621832Youve really written a really excellent quality post here. Thank you extremely a lot 282339