భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చంద్రుడిపైకి ప్రయోగించిన విక్రమ్ ల్యాండర్, అందులోని ప్రగ్యాన్ రోవర్ కథ దాదాపు ముగిసింది. చంద్రుడిపై పగలు సమయం శనివారం ముగిసి, రాత్రి సమయం ప్రారంభమైంది. దీంతో ఇప్పటివరకు ఉన్న కొంచె ఆశలు కూడా ఇక వదిలేసుకోవాల్సిందే. చంద్రుడిపై ఒక్క రోజంటే భూమిపై 14 రోజులతో సమానం. విక్రమ్ ల్యాండర్ లో ఏర్పాటు చేసిన రోవర్ జీవిత కాలం చంద్రుడిపై ఒక్క లూనార్ రోజు. అంటే 14 రోజుల మాత్రమే దీనిని పనిచేసేలా రూపొందించారు. చంద్రుడిపై పగటి సమయం శనివారం ఉదయం ముగిసి, రాత్రి సమయం ప్రారంభం కావడంతో ఉష్ణోగ్రతలు విపరీతంగా మారిపోతాయి. ఏకంగా మైనస్ 200 డిగ్రీలకు తగ్గిపోతాయి. అంతటి శీతల పరిస్థితులను విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్ తట్టుకోలేవు. ఈ నేపథ్యంలో వాటి కథ ముగిసినట్టే అని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
ఇస్రో చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం చివరి నిమిషంలో ఒడుదొడుకులకు లోనైన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 7న తెల్లవారుజామున విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగే క్రమంలో జాబిల్లికి 2.1 కిలోమీటర్ల దూరంలో ఉండగా భూమితో సంబంధాలు కోల్పోయింది. సాఫ్ట్ ల్యాండింగ్ కాకుండా హార్డ్ గా ల్యాండ్ కావడం వల్లే ల్యాండర్ డ్యామేజీ అయి ఉండొచ్చని పలువురు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ల్యాండర్ తో సంబంధాల పునరుద్ధరణ కోసం ఇస్రో చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
ఈ విషయంలో నాసా సాయం తీసుకున్నా ప్రయోజనం కనిపించలేదు. ల్యాండర్ ఉన్న ప్రదేశాన్ని ఆర్బిటర్ గుర్తించినా.. దాంతో సంబంధాల పునరుద్ధరణ కోసం 14 రోజులుగా విశ్వ ప్రయత్నాలు చేశారు. ఇక అక్కడ పగటి సమయం ముగియడంతో ఆశలు దాదాపుగా వదిలేసుకున్నారు. మళ్లీ 14 రోజుల తర్వాత రాత్రి సమయం ముగిసి పగలు ప్రారంభమైన అనంతరం విక్రమ్ ల్యాండర్ పరిస్థితిని పరిశీలిస్తారు. కాగా, బ్రేక్ గా పనిచేయాల్సిన ల్యాండర్ థ్రస్టర్లు ఆ పని చేయడంలో విఫలం కావడం వల్లే హార్డ్ ల్యాండింగ్ అయిందని ఓ శాస్త్రవేత్త తెలిపారు. దీంతో ల్యాండర్ సిగ్నలింగ్ వ్యవస్థ కు నష్టం వాటిల్లిందని వివరించారు.
499175 694376I gotta bookmark this internet site it seems extremely beneficial . 982506
562326 198579I truly prize your piece of function, Fantastic post. 98309